ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాలనతో దూసుకుపోతున్నారు.. తన పాలనలో ఆంధ్ర అభివృద్ధి పరుగులు పెట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ 8 నెలల పాలనలో ఎన్నో సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు.. పసి పిల్లల నుండి పెద్ద వారి వరుకు ప్రతి ఒక్కరి ముఖంలో నవ్వులు పూయించారు సీఎం జగన్.
అంతేకాదు ఇంట్లో పుట్టిన పాప నుండి వృద్ధుడి వరుకు ప్రతి ఒక్కరికి తాను ప్రవేశ పెట్టిన పథకాలు అందేలా సీఎం జగన్ చూసుకుంటున్నారు. తన పాలనా ఎంత అద్భుతం అంటే.. కేవలం ఆరు నెలలో ప్రజల నోటా సీఎం జగన్ సంచలనం అని అనేలా అయన అభివృద్ధి వైపు అడుగులు వేశారు.
అయితే సీఎం జగన్ పాలనలో టాప్ 10 మంత్రులు కొందరు ఉన్నారు.. అందులో బోత్స సత్యనారాయణాది అగ్రస్థానం అనే చెప్పాలి. ఎందుకంటే.. వ్యూహాలు వేయడంలో దిట్ట.. బోథా సత్యనారాయ.. అయిన సీనియర్ రాజకీయ దిగ్గజం బొత్స సత్యనారాయణ ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి అందివచ్చిన వరంగా మారారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నారు.
ప్రభుత్వ సంచలన నిర్ణయాలను ఆయన ముందుగానే చూచాయగా వెల్లడించి.. ప్రభుత్వానికి మార్గం సుగమం చేస్తున్నారనే వాదన ఉంది. ప్రభుత్వ పక్షాన మంచి బలమైన వాయిస్కూడా వినిపిస్తున్నారు. అంతేకాదు.. ప్రతిపక్షాలకు ముందుగానే హింట్లు ఇచ్చి వాళ్ళు రెచ్చిపోయి ఆపేసకా ఆ నిర్ణయాలను అమలు చేస్తున్నారు..
అప్పుడప్పుడు అవమానాలు ఎదురవుతున్నప్పటికీ.. ప్రతిపక్ష నాయకలు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ వాటన్నింటిని బొత్స సత్యనారాయణ వెనక్కి తిప్పికొడుతూ.. వైసీపీ ప్రభుత్వానికి మార్గం చూపుతూ సంచలన మంత్రిగా.. బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ అంటే చాలు ప్రతిపక్షాలు గుండెలు ధడేల్ అనేలా మాట్లాడి సంచలన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు.