మనం.. సోషల్ మీడియాలో గతంలో ఓ పోస్ట్ చూశాం.. ఆ పోస్ట్ ఏంటి అంటే.. ఒక నీచుడు మన జండాను కాలుస్తూ పైశాచిక ఆనందం పొందండం మనం కళ్లారా ఫోటోలలో చూశాం.. అప్పుడు మనం ఏం చేశాం. వెంటానే ఆ నీచుడు గురించి పోలీసులకు చెప్పం.. కంప్లైట్ ఇచ్చం. అలాంటి భారతీయుడునికి వూరికే వదలకండి అని అన్నము. 

 

అలాంటి మనము.. ఈరోజు ఒకడు మన కళ్ళ ముందే మన జాతీయ జండాను కాలుస్తుంటే బొమ్మల్లా చూసి చివరికి పోలీస్ కంప్లైన్ట్ ఇచ్చారు. అసలు కాల్చిన వ్యక్తిని కాదు చూసి వాడిని అక్కడే కొట్టకుండా వదిలేసినా వాడిని అనాలి అని నెటిజన్లు మండిపడుతున్నారు. అవును.. నిజంగానే మన జాతీయ జండాను కాల్చారు.. అదెక్కడో కాదు మన తెలంగాణలోనే కాల్చారు. 

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం తిరుమలపురంలో ఓ వ్యక్తి జాతీయ జెండాను తగలబెట్టాడు. దేశమంతా ఎంతో ఆనందంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకుంటుంది. అలాంటి సమయంలో ఈ నీచుడు మన జండాను తగులబెట్టాడు. అది ఎందుకు తగలబెట్టాడో తెలుసా? 

 

రిపబ్లిక్‌ డే సందర్భంగా తిరుమలపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి జాతీయ జెండాను ఎగరవేశారు. అయితే ఆ సమయంలో గ్రామ సర్పంచ్‌ రాంబాబు అక్కడ లేడు.. దీంతో సర్పంచ్‌ లేకుండానే జాతీయ జెండా ఎగరవేస్తారా అంటూ రాంబాబు సోదరుడు అసూయతో జండాను తగులబెట్టాడు. 

 

దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా..  రంగంలోకి దిగిన పోలీసులు సర్పంచ్‌ సోదరున్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు. అయినా జాతీయ జండాను అంతమంది ముందు కాల్చేశాడు అంటే.. అతను ఊరిలో ఇంకెన్ని దారుణాలు చేస్తున్నాడో.. దేశంపైనే గౌరవం లేనివాడికి ఇంకా ఉరిపై ఎం ఉంటుంది? మనుషులపై ఎం ఉంటుంది? ఇలాంటి వాళ్ళను ఎం చెయ్యాలి ? అని నెటిజన్ల ప్రశ్న.. 

మరింత సమాచారం తెలుసుకోండి: