రష్మిక మందన్న నటీగా 2016 లో కిరిక్ పార్టి అనే కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఆ తరువాత ఆమె పునీత్ రాజ్‌కుమార్ సరసన అంజని పుత్ర , గణేశ్ సరసన ఛమక్ అనే కన్నడ చిత్రాలలో నటించింది.. ఇక మన టాలీవుడ్‌కు 2018 లో ఛలో చిత్రంతో ప్రవేశించింది. ఈ చిత్రంలో నాగ శౌర్య తో జోడికట్టిన రష్మిక కు తొలి తెలుగు చిత్రం.. కాగా ఛ‌లో, సినిమా తర్వాత వరుసగా అవకాశాలను అందిపుచ్చుకున్న ఈ కన్నడ బ్యూటీ గీత గోవిందం, డియ‌ర్ కామ్రేడ్‌… ఇలా వ‌రుస క్రేజీ చిత్రాల్లో న‌టిస్తున్న తాజాగా స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో త‌న ఖాతాలో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని  జమ చేసుకుంది.

 

 

కూల్ గా వచ్చిన రష్మిక ఎక్కువగా అభిమానుల నోళ్లల్లో నానకుండానే వరుసగా హిట్ చిత్రాల్లో నటించింది. ఇకపోతే స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో కొన్ని సీన్స్‌లో ర‌ష్మిక, హీరో మ‌హేష్‌ బాబుతో తో చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఇక ఈమె నటనకు త్రివిక్ర‌మ్ ఫిదా అయ్యాడట. అందుకే త‌న త‌దుప‌రి చిత్రంలో ఛాన్స్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ సొంతం చేసుకున్న త్రివిక్ర‌మ్, వెంట‌నే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో నెక్స్ట్ సినిమాని మొద‌లు పెట్ట‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్న విష‌యం తెలిసిందే.

 

 

ఇందులో ఎన్టీఆర్‌కు జోడీగా ర‌ష్మిక మంద‌న్న అయితే బాగుంటుంద‌ని భావిస్తున్నార‌ట‌. ఇకపోతే అరవింద సమేత తరవాత ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ మరోసారి కలిసి పనిచేయనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.. ఇకపోతే అల్లు అర్జున్‌తో సుకుమార్ తెర‌కెక్కిస్తున్న చిత్రంతో ర‌ష్మిక న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇదే కాకుండా నితిన్‌ హీరోగా తెరకెక్కుతున్న భీష్మా సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు కన్నడలో పొగరు, తమిళ్‌లో సుల్తాన్‌ సినిమాలు చేస్తోంది రష్మిక. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి...

మరింత సమాచారం తెలుసుకోండి: