విజయసాయి రెడ్డి... ఎప్పుడు ఏదో ఒక విషయంపై ప్రతిపక్షంపై సోషల్ మీడియాలో ఫైర్ అవుతూ ఉంటారు.. వైసీపీ ప్రధాన కార్యదర్శి అయినా విజయసాయి రెడ్డి.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. ప్రతిపక్షాలు చేసే చిల్లర ఆరోపణలపై ఘాటుగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు.  

 

ఈ నేపథ్యంలోనే మండలి రద్దు తర్వాత తన సొంత ఎమ్మెల్సీలకు పదవీకాలం ముగిసేంత వరకు జీత భత్యాల కింద ఎంత వస్తుందో అంత చెల్లిస్తాడట అంటూ చంద్రబాబుపై ట్విట్టర్ వేధికగా సెటైర్లు వేశాడు విజయసాయి రెడ్డి. ఈ మేరకు ట్విట్టేర్ వేధికగా సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. 

 

విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తే.. ''అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను సంతలో పశువుల్లా కొన్నాడు. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్సీలకు డబ్బు ముట్ట చెబుతున్నాడు. ఎమ్మెల్సీలు ఎక్కడ ధిక్కరిస్తారో అని నిద్ర పోవడం లేదు. వారి పదవీకాలం ముగిసేంత వరకు జీత భత్యాల కింద ఎంత వస్తుందో అంత చెల్లిస్తాడట!'' అంటూ సెటైరికల్ ట్విట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు విజయసాయి రెడ్డి. 

 

నిజానికి.. చందబ్రాబు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీలో ఎవరు ఉండకూడదు అనే దురుద్దేశంతో వైసీపీ పార్టీలో అమ్ముడుపోయిన వారందరిని అంటే.. ఎమ్మెల్యేలను, ఎంపీలను సంతలో పశువులను కొన్నట్టు ఎంత అంటే అంత డబ్బుపోసి కొన్నాడు. అప్పట్లో చంద్రబాబు పనులకు వైసీపీ మళ్ళి అధికారంలోకి వస్తుందా లేదా అనే సందేహాలు వచ్చాయి. అయితే వైసీపీ పార్టీని ఖాళీ చేయించాలి అనుకున్న చంద్రబాబు పార్టీ ఇప్పుడు దాదాపు 70 శాతం ఖాళీ అయిపోయింది అని నెటిజన్లు జోకులు మీద జోకులు వేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: