రోజు రోజుకి ఆక‌తాయిల ఆగ‌డాలు ఎక్కువ‌వుతున్న ఏప‌ధ్యంలో మృగాళ్ళ ఆగ‌డాలు ఎక్క‌డా ఆగ‌డం లేదు. హైదారాబాద్‌లో ఇంట్లో ఉన్న మైన‌ర్ బాలిక పై కామాంధుడు కన్నువేశాడు. బాలిక పై ఇంట్లోకి చొర‌బ‌డి ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ విష‌యాన్ని ఎవ‌రికైనా చెబితే చంపేస్తానంటూ భ‌య‌పెట్టి ప‌దిరోజుగా బాల‌క పై కిరాత‌కంగా అత్యాచారం చేస్తున్నాడు.  బాలిక ఆరోగ్యం క్షీణించ‌డంతో త‌ల్లిదండ్రుల‌కు కామాంధుడు అస‌లు విష‌యం బ‌య‌ట పెట్టింది. వివ‌రాల్లోకి వెళితే.. 

 

పంజాగుట్ట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో అద్దెకు ఉంటున్న ఓ దంప‌తుల‌కు కుమార్తె ఉంది. దంప‌తులిద్ద‌రూ ప్ర‌తిరోజు కూలిప‌ని చేస్తూ జీవ‌నం సాగిస్తున్నారు. త‌ల్లిదండ్రులిద్ద‌రూ ప‌నుల‌కు వెళ్ళ‌డంతో ఆ బాలిక ఇంట్లో ఒంట‌రిగా ఉంటుంది.  ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన కామాంధుడు జ‌హాంగిర్‌ ఆ మైన‌ర్ బాలిక పై క‌న్నేశాడు. దీంతో ఆ అఘాయిత్యానికి పాల్ప‌డ్డాడు. ఈ విష‌యం పై బాలిక త‌ల్లిదండ్రులు పంజాగుట్ట పోలీస్టేష‌న్‌లో కామాంధుడి పై ఫిర్యాదు చేశాడు.  బాలిక‌ను వైద్య ప‌రీక్ష‌లు నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. 

 

హైదరాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మైనర్ బాలికపై పది రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడో కామాంధుడు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో నివాసం ఉంటున్న దంపతులకు కూతురు ఉంది. తల్లి ఇళ్లలో పని చేస్తుండగా, తండ్రి పాల వ్యాపారం చేస్తున్నాడు. అయితే.. పని కోసం వాళ్లు బయటికి వెళ్తుండటంతో బాలిక ఒంటరిగా ఉంటోందని గుర్తించిన జహంగీర్ అనే యువకుడు.. పది రోజుల క్రితం బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఆమెపై లైంగిక దాడి చేశాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి రోజూ ఆమెపై విరుచుకుపడ్డాడు. మంగళవారం నాడు ఆ బాలిక  నీరసంగా కనిపించడంతో తల్లిదండ్రులు ఏమైందని అడిగారు. నిందితుడు ప‌రారీలో ఉండ‌గా, పోలీసులు నిందితుడు కోసం గాలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: