ఎంతో అన్యోన్యంగా ఉండాల్సిన భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు జరుగుతూ ఉండటం. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న చిన్న వివాదాలు కాస్త ఒకరీ  ప్రాణాలు ఒకరు తీసుకునేంత వరకు వెళ్లడం... ఆ తర్వాత హత్య చేసిన వారు కటకటాల పాలవడంతో పిల్లలు ఆనాధలు అవ్వటం  లాంటివి ఘటనలు రోజుకొకటి తెరమీదికి వస్తూనే ఉన్నాయి. చిన్న చిన్న వివాదాలకి కసాయి లాగా మారి ప్రాణాలు సైతం తీసేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఘటనలు చాలానే తెరమీదికి వస్తుండగా తాజాగా ఇలాంటి ఘటనే  మరోటి జరిగింది. మద్యం మత్తులో భార్యతో గొడవపడిన భర్త అతి దారుణంగా భార్యను హత్య చేశాడు. 

 

 

 రాత్రంతా భార్య మృతదేహం పక్కనే నిద్రించి ఉదయం పోలీస్ స్టేషన్ లో  లొంగిపోయాడు సదరు భర్త. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... లంగర్హౌస్ పోలీస్ స్టేషన్  పరిధిలో కోసిగి మండలం ముసిరప్ప  గ్రామానికి చెందిన ఎల్లప్ప అమృతలు దంపతులు. వీరికి ఒక కుమారుడు కుమార్తె కూడా ఉన్నారు. గత కొన్నేళ్లుగా వీరు లంగర్ హౌస్ లోని మందుల బస్తీలో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే గత కొంత కాలం నుండి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేది. వీరి గొడవలు ఇంటి నుండి గ్రామ పంచాయతీ వరకు వెళ్లాయి. ఇక గ్రామ పెద్దలు పలుమార్లు పంచాయితీ పెట్టి సముదాయించారు కూడా . అయినప్పటికీ వీరి మధ్య గొడవలు మాత్రం ఆగలేదు. తాజాగా మంగళవారం రాత్రి ఇంట్లో మద్యం తాగి భర్త ఎల్లప్ప భార్యతో గొడవ పడ్డాడు. 

 

 

 ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఊగిపోయిన భర్త ఎల్లప్ప భార్యను చంపాలనుకున్నాడు. అర్ధరాత్రి ఆమె గొంతు నులిమి... ఇంట్లో ఉన్న చిన్న సిలిండర్ తో తలపై గట్టిగా కొట్టి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహం దగ్గరే రాత్రంతా నిద్రించాడు. ఆ తర్వాత బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు ఎల్లప్ప. కాగా గతంలో ఓ వ్యక్తి హత్య కేసులో కూడా ఎల్లప్ప నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కాగా తల్లి చనిపోవడం తండ్రి జైలుపాలు కావడంతో ఇద్దరు పిల్లలు ఒంటరి వారు అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: