ఆంధ్ర ప్రదేశ్ మంత్రి శంకర్ నారాయణ చంద్రబాబు నాయుడుపై, ఎల్లో మీడియాపై మండిపడ్డాడు. చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి విశాఖపై దృష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శంకర్ నారాయణ విరుచుకుపడ్డారు. మంత్రి శంకర్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ప్రతిపక్షంపై విరుచుకు పడ్డారు. 

              

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శంకర్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ..  ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి రద్దు పార్లమెంట్‌లో ఖచ్చితంగా ఆమోదం పొందుతుందని.. అయితే మండలి రద్దును అడ్డుకునేందుకు ఢిల్లీలో లాబీయింగ్‌ చేస్తానని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు చెప్పడం హాస్యాస్పదంగా అంది అని అయన అన్నారు. 

                      

ఈ నేపథ్యంలోనే శంకర్ నారాయణ మాట్లాడుతూ..  రాజధాని విషయంలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రవర్తిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వికేంద్రీకరణ ఆగదు అని మంత్రి శంకర్ నారాయణ స్పష్టం చేశారు. విశాఖపట్నంపై చంద్రబాబు అండ్‌ టీం దుష్ర్పచారం దుర్మార్గమని మండిపడ్డారు. 

 

కాగా బోస్టన్‌, జీఎన్‌ రావు కమిటీ నివేదికలను బోగి మంటల్లో వేయాలన్న టీడీపీ నేతలు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారని అయన విమర్శలు చేశారు.. అంతేకాదు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని గత టీడీపీ ప్రభుత్వంలో లాయర్లు 90 రోజులు ధర్నాలు చేశారు.. అది మర్చిపోయావా చంద్రబాబు ? అంటూ ఆ విషయాన్ని గుర్తుచేశారు మంత్రి శంకర్ నారాయణ. 

 

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఎవరడిగారని యనమల వ్యాఖ్యానించాడు.. ఆ విషయాన్ని కాస్త గుర్తు తెచ్చుకో.. ఇలా మాట్లాడటం తగదని మంత్రి శంకర్‌ నారాయణ హెచ్చరించారు. మరి ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు యనమల ఎలా స్పందిస్తారు అనేది చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: