ఈ మధ్య ప్రేమలు బాగా పెరిగిపోతున్నాయి. కొంతమంది లవ్ చేసి పెళ్లి వరకు వస్తే... ఇంకొంతమంది లవ్ చేసి బ్రేకప్ అవుతారు. ప్రేమించడం సరే కానీ ఆ తర్వాత పెద్ద వాళ్ళు ఒప్పించడం కూడా కాస్త కష్టమైన పనే కదా. ఈ క్రమంలోనే ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇక తమ పెద్దల ఒప్పించడానికి బాగానే కష్టపడడ్డారు . ఈ క్రమంలోనే ఆ యువకుడు తన తండ్రిని ఒప్పించడానికి ప్రేమ విషయం చెప్పాడు. తండ్రి  ససేమిరా అనడంతో ఆ అమ్మాయి లేకపోతే బతకలేను అంటూ కొడుకు చెప్పాడు. దీంతో కోపంతో ఊగిపోయిన తండ్రి ఎలాగైనా ఆ అమ్మాయిని తన కొడుకు నుంచి దూరం చేయాలని భావించాడు దీంతో దారుణానికి ఒడిగట్టాడు. 

 

 

 వివరాల్లోకి వెళితే... కొడుకు ప్రేమించిన అమ్మాయి పై తండ్రి అత్యాచారం చేసిన ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. కొడుకు ప్రేమించిన యువతి ఇంటికి వెళ్లిన తండ్రి మీ ఇద్దరికీ పెళ్లి చేస్తా అంటూ నమ్మించి ఆ యువతిని వెంట తీసుకు వచ్చాడు. మార్గమధ్యంలో నిర్మానుష్య ప్రదేశంలో కి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ముఖేష్ కన్నా అనే వ్యక్తి ఓ యువతితో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నాడు. అయితే తమ ప్రేమను అంగీకరించాలి అంటూ కొడుకు ముఖేష్ కన్నా తండ్రి నిత్యానందను కోరాడు. ఎలాగైనా ఆ యువతిని కొడుకు నుంచి దూరం చేయాలని భావించిన తండ్రి ఆ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 

 

 

 ఆ యువతిపై అత్యాచారం చేసి అనంతరం ఆ యువతికి తాళి కట్టాడు. ఇకనుంచి తనతోనే కాపురం చేయాలని లేకపోతే చంపేస్తాను అంటూ బెదిరించాడు తండ్రి నిత్యానందం. ఆ యువతిని తన స్నేహితుడి ఇంట్లో నిర్బంధించాడు. పలు మార్లు ఆ యువతిపై అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. మరోపక్క ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకోబోతున్నదని నిన్ను మోసం చేసింది అంటూ కొడుకును నమ్మించాడు. కాగా నిర్బంధంలో ఉన్న యువతి ఎలాగోలా తప్పించుకుని వేదారణ్యం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: