తెలుగు దేశం పార్టీ కి కాలం కలిసి రావట్లేదు లా ఉంది. ఆ పార్టీ మునుపెన్నడూ చూడని ఓటమిని చూసింది గత ఎన్నికల్లో, అప్పటినుండి ఆ పార్టీకి జగన్ రూపంలో కస్టాలు మొదలయ్యాయి. పట్టిందల్లా బంగారం అయ్యే పార్టీకి నేడు బంగారం పట్టుకున్న బొగ్గు ఐపోతుంది. చంద్రబాబు సారథ్యంలో ఆ పార్టీ నాయకులు పొఱాడుతున్నప్పటికి కాలం కలిసి రావడంలేదు. బీజేపీతో వివాదం మొదలు అయినప్పటినుండి ఆ పార్టీ కి కస్టాలు మొదలు అయ్యాయి.
గత పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవి చూసిన ఆ పార్టీ తక్కువ ఎంపీ స్థానాలకే పరిమిత మైనది. ఇదే సమయంలో గత ఎన్నికల్లో వైకాపా పార్టీ 22 మంది ఎంపీ స్థానాలను కైవసం చేసుకొని విజయ బావుటా ఎగుర వేసింది.
ఓం బిర్లా గ్రౌండ్ ఫ్లోర్లోని 5వ నెంబర్ గదిలో గత 30 ఏళ్లుగా టీడీపీ కార్యాలయం కొనసాగుతోంది. ఇప్పుడు ఇదే భవనాన్ని మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్న వైకాపా పార్టీ కి అప్పచెప్పాలని, వైకాపా ఎంపీ సభ్యులు స్పీకర్ ను కోరగా, స్పీకర్ ఆ భవనాన్ని వైకాపా సభ్యులకు కేటాయించారు. గత 30 సంవత్సరాలుగా టీడీపీ కార్యాలయం అదే భవనం లో ఎదో ఒక లాలూచి చేసి కొనసాగుతోంది. కావున వారు ఈ భావాన్ని వైకాపా కు ఇచేందుకు మొగ్గు చూపలేదు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఓం బిర్లాను విజయసాయిరెడ్డి లేఖ ద్వారా స్పీకర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో పార్లమెంట్ సిబ్బంది మూడో అంతస్తులోని 118 నెంబర్ గదికి టీడీపీ కార్యాలయం తరలించారు. గ్రౌండ్ ఫ్లోర్లోని 5వ నెంబర్ గదిని వైఎస్సార్సీపీ కార్యాలయంగా మార్చారు.