ఈ రోజుల్లో మనిషి ప్రాణాలు అంటే అస్సలు లెక్క లేకుండా పోయింది. మనిషి ప్రాణాలను తీయడానికి వెనకాడడం లేదు సాటి మనుషులు. ముఖ్యంగా దొంగతనం చేయడానికి వచ్చిన వారు... తమ దొంగతనాలకు అడ్డొచ్చిన వారిని అతి దారుణంగా చంపేస్తున్నారు. మనుషుల ప్రాణాలు తీసి మరీ అందినకాడికి దోచుకో పోతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ రోజుల్లో చాలానే తెరమీదకు వస్తున్నాయి. ఇక తాజాగా ఇలాంటిదే మరో ఘటన జరిగింది. దుండగులు పట్టపగలే తెగబడ్డారు. ఓ మహిళను దారుణంగా హత్య చేసి బంగారు ఆభరణాలను దోచుకుపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

 

 

 వివరాల్లోకి వెళితే... పట్టపగలే దోపిడీకి వచ్చి ఓ మహిళ అతి దారుణంగా చంపేసి ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఘటన ఆలేరు లో సంచలనం సృష్టించింది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన నీలం నీలమ్మ... తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆలేరు లోని క్రాంతి నగర్ నాలుగవ కాలనీలో నివాసం ఉంటుంది. 55 ఏళ్ల నీలమ్మ ఇంట్లోనే ఉంటుండగా కూతురు మంజుల అదే కాలనీలో ఒకరి వద్ద కుట్టుమిషన్ నేర్చుకుంటుంది. కాగా  నీలమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంది అని గమనించిన దుండగులు... మంచి నీళ్లు కావాలి అంటూ ఇంట్లోకి ప్రవేశించారు. ఇంతలో నీలమ్మ గొంతునులిమి మెడలోని బంగారు గొలుసును చెవి కమ్మలు అపహరించుకుపోయారు. ఇక కొద్ది సేపటి తర్వాత నీలమ్మ కూతురు అంజుల ఇంట్లోకి రావడం తో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

 

 

 ఇక వెంటనే 108 అంబులెన్స్ కు ఫోన్ చేయక సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది నీలమ్మ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. ఇక సమాచారం అందుకున్న ఆలేరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఇది దొంగలు పనిగా అనుమానిస్తూ జాగిలాలు రప్పించారు పోలీసులు. అయితే జాగిలాలు కాలనీ నుంచి బహదూర్ పేట రోడ్డు వరకు వెళ్లి నిలిచిపోయాయి. ఇక యాదగిరిగుట్ట సిఐ నరసయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.కాగా  ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: