పెద్దల సభ అయినా శాసనమండలికి నారా లోకేష్ లాంటి దద్దమ్మలను పంపినట్లు చంద్రబాబునాయుడుపై వైసిపి ఎంఎల్ఏ రోజా ధ్వజమెత్తారు. తండ్రి, కొడుకులను రోజా చాలా కాలంగా టార్గెట్ చేస్తునే ఉన్నారు. కాకపోతే వాళ్ళిద్దరే రోజా కౌంటర్లకు ఎన్ కౌంటర్లు వేయలేక నానా అవస్తలు పడుతున్నారు. అందుకనే రోజా కూడా వాళ్ళిద్దరిపై రెచ్చిపోతుంటుంది.

 

తాజాగా అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు భజనమండలితో నిండిపోయిన శాసనమండలి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటూ ఎద్దేవా చేయటమే హైలైట్ గా నిలిచింది.  లోకేష్ జన్మలో ఎంఎల్ఏగా గెలవలేడని తెలిసే చంద్రబాబు కూడా కొడుకును శాసనమండలిలో సభ్యుడిని చేసి మంత్రిగా నియమించుకున్నట్లు బాగానే చెప్పారు.

 

ఎంఎల్సీగా లోకేష్ రాజకీయ జీవితానికి  ఎక్కడ సమాధి పడిపోతుందో అన్న భయంతోనే చంద్రబాబు మండలి రద్దును అడ్డుకుంటున్నట్లు రోజా చాలా ఘాటుగానే వ్యాఖ్యానించారు. పనిలో పనిగా ఇద్దరు హీరోలను కూడా దుమ్ము దులిపేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ, పవన్ కు అసలు జీవోల విడుదల ప్రాసెస్ గురించి ఏమీ తెలీదన్నారు. చీకటి జీవోలంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు రోజా పాత బాస్ పై  తీవ్రంగా విరుచుకుపడ్డారు.

 

బాలకృష్ణపై మాట్లాడుతూ ఎన్టీయార్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచినపుడే చాలకృష్ణ సైగ చేసి బుద్ధి చెప్పుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రాయలసీమ నుండి చంద్రబాబు, బాలకృష్ణలను తరిమికొట్టే రోజు తొందరలోనే వస్తుందంటూ జోస్యం కూడా చెప్పింది లేండి.

 

మొత్తానికి చంద్రబాబు, పవన్ , లోకేష్, బాలకృష్ణలపై రెచ్చిపోయిన రోజా అందరినీ ఒకే సందర్భంలో  ఉతికి ఆరేసిందనే చెప్పాలి. ప్రత్యర్ధులపై దాటిగా విరుచుకుపడటంలో రోజా స్టైలే వేరని ఇప్పటికే చాలా సార్లు నిరూపణ అయ్యింది. ఎంఎల్ఏగా ఉన్నపుడే ప్రత్యర్ధులను ఇలా వాయించేస్తుంటే ఇక మంత్రిగా కూడా అయ్యిందంటే ఇక పట్టుకోవటం కష్టమేనేమో ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: