మొన్నటికి మొన్న హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ వైసీపీ కి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. నా మౌనాన్ని చేతగానితనం గా తీసుకోవద్దని ఒక్కసారి కనుసైగ చేస్తే  ఏం జరుగుతుందో తెలిసేది అంటూ ఆ వ్యాఖ్యానించారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన నగరి ఎమ్మెల్యే వైసీపీ నేత రోజా బాలకృష్ణ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ కు  చంద్రబాబు వెన్నుపోటు పొడిచి ద్రోహం చేసిన నాడే బాలకృష్ణ సైగ   చేసి బుద్ధి చెప్పి ఉంటే బాగుండేది అంటూ ఏపీఐఐసీ చైర్మన్ నగరి ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. రాయలసీమ నుంచి బాలయ్యను చంద్రబాబు తరిమికొట్టే రోజు తప్పకుండా వస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా అమరావతి లో మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే రోజా... ఈ సందర్భంగా బాలయ్యతో పాటు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ పై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 

 

 

 పెద్దల సభ రద్దు చేయడాన్ని తప్పుపడుతున్న చంద్రబాబు పెద్దల సభకు పెద్దలను తీసుకురాకుండా దద్దమ్మలని తీసుకొచ్చారు అంటూ లోకేష్ ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. లోకేష్ ఎలాగో ఎమ్మెల్యేగా గెలవలేదు... ఇప్పుడు జగన్ సర్కార్ శాసనమండలిని రద్దు చేస్తే... లోకేష్ కి ఎమ్మెల్సీ పదవి కూడా పోయి... లోకేష్ రాజకీయ భవిష్యత్తును సమాధి అవుతుందని శాసనమండలి రద్దును  టిడిపి అధినేత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారు అంటూ రోజా విమర్శించారు. చంద్రబాబు భజన చేసే వారే మండలిలో ఉన్నారని.. అలాంటివారు శాసనమండలిలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రోజా. 

 

 

 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జీవోల  గురించి తెలియదు అని వ్యాఖ్యానించిన రోజా... చీకటి జీవోలు అంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 3 రాజదానులు  నిర్మించి తీరుతారూ అని వ్యాఖ్యానించారు. విపక్ష పార్టీలు కుతంత్రాలతో ఎన్ని ఇబ్బందులు సృష్టించినప్పటికీ కూడా..3 రాజధానిలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు అంటూ రోజా స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: