రోజు రోజుకు మనుషుల మధ్య బంధాలు పూర్తిగా అంతరించి పోతున్నాయనడానికి ఎన్నో దారుణమైన ఘటనలు కళ్ల ముందు జరుగుతున్నాయి.. ఇప్పుడున్న పరిస్దితుల్లో మానవత్వం, మంచితనం అన్ని చేతగాని చర్యలా మిగిలిపోతున్నాయి. ఇక పిల్లలు పుట్టలేదనే బాధ ప్రతి వారికి ఉంటుంది. ఇది ఒకప్పటి మాట.. కానీ నేటికాలంలో లోకంలో జరుగుతున్న కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే అసలు పిల్లలను ఎందుకు కన్నామా అనిపించేలా మారుతున్నారు.

 

 

ఇలాంటి సందర్భాలు ఎదురు అవుతున్నాయి.. కన్నవారు, తోడ బుట్టిన వారు అనే తేడాలే లేకుండా ఈ కాలం మనుషుల హృదయాలు కర్కశంగా మారుతున్నాయి. ఇందుకు రోజు రోజుకు కళ్లముందు జరుగుతున్న, మీడియాలో వస్తున్న ఘటనలే సాక్షాలు.. ఇకపోతే కన్న తండ్రినే కఠినంగా చంపిన ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు తెలుసుకుంటే..హత్రాస్‌ జిల్లాకు చెందిన రాజ్‌పాల్‌ దగ్గర 20 రూపాయలు ఉన్న విషయం తెలుసుకున్నఅతని ఇద్దరు కొడుకులు డబ్బులు కావాలని అడిగారు.

 

 

అందుకు ఆ తండ్రి ఆ డబ్బులు ఇంటి అవసరాలకోసం తెచ్చానని, ఇవ్వడం కుదరదని చెప్పడంతో ముగ్గురి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఇద్దరు కొడుకులు తండ్రిని కర్రలతో దాడిచేసి చితకబాదారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన అతను చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు.. ఇకపోతే ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించి, తండ్రి చావుకు కారణమైన ఇద్దరు కొడుకులను అరెస్ట్‌ చేశారు.

 

 

హత్యానేరం, దాడి, తదితర సెక్షన్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు... చూసార పిల్లలను కనేది వారిచేతిలో చావడానికే అని ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు నిరూపిస్తున్నాయి.. అన్ని సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచి, పోషించి, పెద్ద చేస్తే, చివరకు కనికరం లేకుండా ప్రాణాలు తీసేలా తయారు అవుతున్నారు..తల్లిదండ్రుల పాలిట యమ పాశంలా మారుతున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: