ఫిబ్రవరి 15వ తేదీన చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖులు జననాలు ఇంకెంతో మంది ప్రముఖుల మరణాల జరిగాయి. ఒక్కసారి చరిత్ర లోకి వెళ్లి చూసి ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం రండి.
మానవుని జన్యు ప్రచురితం : 2001 ఫిబ్రవరి 15వ తేదీన మానవుని యొక్క పూర్తి నిర్మాణం నేచర్ పత్రికలో ప్రచురించబడింది.
గెలీలియో జననం: గణితజ్ఞుడు భౌతిక శాస్త్రవేత్త అయిన గెలీలియో 1564 ఫిబ్రవరి 15వ తేదీన జన్మించారు. ఈయన టెలిస్కోపును కనిపెట్టి వాడుకలోకి తెచ్చిన గొప్ప వ్యక్తి. ప్రస్తుతం ఈయన కనిపెట్టిన టెలిస్కోప్ నేటి తరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈయన కనిపెట్టిన టెలిస్కోప్ ఎన్నో పరిశోధనలకు మూలకారణమైనది.
సంత్ సేవాలాల్ మహారాజ్ జననం : బంజారాల ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15వ తేదీన జన్మించారు. ఆయన హిందూ ధర్మం గొప్పతనం బంజారాలకు తెలియజేయడానికి జన్మించిన మహానుభావుడుగా భావిస్తారు. ఈయన అనంతపురం జిల్లా రాంజీ నాయక్ తండ లో జన్మించారు. లంబాడీలు ప్రతి సంవత్సరం సేవాలాల్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు.
అట్లూరి పూర్ణచంద్రరావు జననం: ప్రముఖ తెలుగు హిందీ చలన చిత్రాల నిర్మాత కమ్యూనిస్టు నాయకుడు అయిన అట్లూరి పూర్ణచంద్రరావు 1938 ఫిబ్రవరి 15వ తేదీన జన్మించారు. 1964 మొట్టమొదటిసారిగా అగ్గిమీదగుగ్గిలం అనే చిత్రాన్ని ప్రారంభించాడు. శరత్ బాబు ని సినీ నటుడిగా పరిచయం చేశాడు ఆయన.
రావులపల్లి గుర్నాథరెడ్డి జననం : ఐదు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన రావులపల్లి గుర్నాథరెడ్డి 1944 ఫిబ్రవరి 15వ తేదీన జన్మించారు. మహబూబ్నగర్ జిల్లా కొండపాక మండలం రావులపల్లి లో జన్మించిన ఈయన 1972లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తొలిసారిగా కొడంగల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇక వరుసగా 5 సార్లు అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
రాధారెడ్డి జననం : ప్రముఖ కూచిపూడి కళాకారులు నాట్య గురువు అయిన రాధారెడ్డి 1952 ఫిబ్రవరి 15వ తేదీన జన్మించారు. కూచిపూడి నాట్యంలో ఎంతో ప్రసిద్ధి చెందారు ఈమె.
మీరాజాస్మిన్ జననం : తెలుగు ప్రేక్షకులకు మీరాజాస్మిన్ తెలియని వారు కాదు. తన నటనకు జాతీయ అవార్డును సైతం దక్కించుకున్న మీరాజాస్మిన్ 1984 ఫిబ్రవరి 15వ తేదీన జన్మించారు. హీరోయిన్ గా మలయాళ కన్నడ తో పాటు పలు తెలుగు సినిమాల్లో కూడా నటించారు. కొన్ని ఏళ్లపాటు పరిశ్రమలో టాప్ హీరోయిన్లుగా కొనసాగారు మీరా జాస్మిన్. కాగా తెలుగులో మీరాజాస్మిన్ చేసిన చిత్రాల్లో ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోయే చిత్రం గోరింటాకు. ఈ చిత్రంలో రాజశేఖర్ కు చెందిన మీరాజాస్మిన్ నటనకు ఎన్నో ప్రశంసలు కూడా అందుకున్నారు. ఎంతో మంది స్టార్ హీరోల తో నటించి ఎన్నో అవార్డులను సైతం దక్కించుకున్నారు మీరు జాస్మిన్.