ఈ మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొందరికి పిచ్చి ఒక రేంజ్ లో పెరిగిపోయింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. చిన్న చిన్న వాటికి కూడా సోషల్ మీడియాలో సందడి చేయడం హడావుడి చేయడం వంటివి చేస్తున్నారు. ప్రధానంగా టిక్ టాక్ ఫేస్బుక్ కోసం ఇంట్లో వాళ్ళను కూడా వేధించడం మొదలుపెట్టారు కొందరు. ఇక వారి ప్రాణాలను కూడా లెక్క చేయడం లేదు కొన్ని సందర్భాల్లో. టిక్ వీడియో ల కోసం ఎంత వరకు అయినా వెళ్తున్నారు. ఎవరు అయినా లైక్ కొట్టడం ఆలస్యం చూసి పొంగిపోయే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. 

 

మొన్నటి వరకు ట్రెండ్ గా ఉన్నదీ ఇప్పుడు పిచ్చి గా మారింది. ఇక కుర్రాళ్ళు అయితే బండి మీద వెళ్ళే సమయంలో కొన్ని యాక్షన్ స్టంట్ లు చేస్తున్నారు. దీనితో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. సోషల్ మీడియాలో వీడియో లు పోస్ట్ చేయడానికి మరొకటి మరొకటి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఇలా చేసే ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్ జిల్లాలో జరిగింది ఈ సంఘటన. వివరాల్లోకి వెళితే ప్రదీప్ గౌడ్ అనే ఒక యువకుడు తాజాగా బండి మీద వీడియో రికార్డ్ చేసాడు. ఈ వీడియోలో లవ్ ఫెయిల్ అయినట్టు చెప్పాడు. 

 

అతి వేగంగా బండి నడుపుతూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఘటన చూసిన స్థానికులు అతను మితిమీరిన వేగంతో వెళ్ళాడని చెప్పారు. వీడియో రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేసాడని, ఈ క్రమంలోనే వాహనం అదుపు తప్పినట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతను ఆ వీడియో ఎందుకు రికార్డ్ చేసాడు అనేది స్పష్టత రావడం లేదు. ప్రేమ ఫెయిల్ అవ్వడమా లేక ఇంకేదైనా కారణం ఉందా అనే దానిపై ఆరా తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: