ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఐటి దాడుల సోదాల్లో  చంద్రబాబు మాజీ పిఎ శ్రీనివాస్ చౌదరి దగ్గర రెండు వేల కోట్లు పట్టుబడినట్లు వార్తలు రావడం జరిగింది. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు గత నాలుగు రోజులనుండి మీడియా ముందుకి రావటం కూడా పెద్దగా లేదు. మొదటిలో రెండు వేల కోట్లు దొరికినవి అంటూ వస్తున్న వార్తలలో వాస్తవం లేదని అవన్నీ అబద్ధాలు అంటూ టిడిపి నేతలు పేర్కొన్నారు. అయితే రాను రాను బలమైన వార్తలు స్వయంగా ఐటీ శాఖ వస్తున్న వార్తలను నిర్ధారించినట్లు ఏపీ లో ఉన్న మీడియాలో వార్తలు రావడంతో తెలుగుదేశం పార్టీ నేతలు మీడియాని ఫేస్ చేయలేకపోతున్నారు.

 

ఇటువంటి తరుణంలో వైసీపీ పార్టీకి చెందిన నాయకులు గత నాలుగు రోజుల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ అదేవిధంగా ఇన్కమ్ టాక్స్ దాడులను ఉద్దేశించి దారుణమైన విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు మరియు నారా లోకేష్ బయటకు వచ్చి వస్తున్న వార్తలకు క్లారిటీ ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఇటీవల ఢిల్లీలో మంత్రి కొడాలి నాని చంద్రబాబు నాయుడు పై సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ చౌదరి ఇంటిలో జరిగిన ఐటీ దాడులపై తీవ్రంగా స్పందించారు. అయితే ఐటీ దాడులలో తాను శ్రీనివాస్ ఇంట్లో 2వేల కోట్ల క్యాష్ దొరికిందని చెప్పలేదని అన్నారు.

 

రెండు వేల కోట్ల రూపాయలు పీఎస్ ఇంట్లో పెట్టడానికి చంద్రబాబు పిచ్చోడు కాదని, అంత డబ్బు ఎవరూ ఇంట్లో పెట్టుకుని కూర్చోరని అన్నారు.అయితే తాను చెప్పింది రెండు వేల కోట్ల అక్రమ సంపాదనకు సంబంధించిన నగదు, ఆస్తుల డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలు దొరికాయని అన్నానని, అంతేకాదు చంద్రబాబు చెప్పిన మేరకు డబ్బులు ఇచ్చిన విషయాన్ని శ్రీనివాస్ తన డైరీలో రాసుకున్నారని అన్నారు. బాబు చేసిన అక్రమాలకు ఇంక తప్పించుకోలేరని గ్యారెంటీగా శిక్ష తప్పదు అంటూ కొడాలి నాని తేల్చి చెప్పారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: