ఈ నెల 24న అమెరికా అధ్యక్షుడు ప్రపంచానికి పెద్దన్న లాంటి వ్యక్తి ట్రంప్  భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మొదటిసారి భారత్లో పర్యటిస్తుండటంతో...  ఎంతో ఆసక్తినీ సంతరించుకుంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం కూడా ఏకంగా వంద కోట్ల వరకు ఖర్చు పెడుతుంది అని అంచనా  ఉన్న విషయం తెలిసిందే. భారతదేశ గొప్పతనాన్ని ట్రంప్ కి  తెలియజేసేలా కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పాటు తన భార్య సలహాదారులు ఇవాంకా ట్రంప్... జావిద్ కృష్ణ కలిసి ఈనెల భారత్లో పర్యటించనున్నారు. అహ్మదాబాద్ లో నిర్వహించే రోడ్ షో తో పాటు నమస్తే ట్రంప్  కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అయితే భారత పర్యటనపై ప్రపంచ పెద్దన్న భారీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. భారత్ లో  తనకు స్వాగతం పలికేందుకు కోటిమందికి వరకు వస్తారని ఆశిస్తున్నారు. ఇండియాలో లక్ష అనే పదాఅన్ని మిలియన్ అనుకున్నారో ఏమో తెలియదు కానీ.. స్వాగతం పలికేందుకు మిలియన్ల  మంది వస్తారు అంటూ చెబుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. 

 

 

 అయితే మ్యాటర్ ఏదైనా... పర్సన్  ఎవరైనా.. టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎ mప్పుడు ఎలా స్పందిస్తారో  ఎవరికీ తెలియని విషయం. ఆయన ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ ల వర్షం కురిపిస్తారో  అన్నది కూడా అంతుపట్టనిది. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి కౌంటర్ ఇస్తూ పోస్టు పెట్టాడు సెన్సేషనల్ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ట్రంప్ పర్యటనపై వ్యంగ్యంగా  స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ట్రంప్ కి  స్వాగతం పలకడానికి కోటి మంది రావాలంటే ఏం చేయాలో తన పోస్టులో చెప్పాడు రాంగోపాల్ వర్మ. 

 

 ట్రంప్ కి స్వాగతం పలకడానికి కోటి మంది రావాలంటే ట్రంప్ తో పాటు స్టేజీపైన బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్,  అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, సౌత్ స్టార్ రజనీకాంత్,  కత్రినా కైఫ్,  దీపికా పదుకొనే తో పాటు  సన్నీలియోన్ కూడా నిలబెడితే ఆయన అనుకున్నట్లుగానే కోటి మంది వస్తారు అంటూ.. సెన్సేషనల్ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ పోస్టు పెట్టాడు. దీనిపై నెటిజన్లు  కూడా భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది మీ ఆలోచన కు హాట్సాఫ్ సార్ అంటూ కామెంట్ కూడా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: