వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి.. సంచలనానికి మరో పేరు.. ఒక ట్విట్ పెడితే చాలు అటుపక్క ప్రతిపక్ష నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. ఈ నేపథ్యంలోనే నేడు ఓ సంచలన ట్విట్ పెట్టారు. ఆ ట్విట్ చూస్తే చంద్రబాబుకు గుండె ఆగడం ఖాయం.. ఆలా ఉంది ఆ ట్విట్.. 

 

అందులో ఏముంది అంటే.. చంద్రజ్యోతి నేవీపై బోగస్ వార్త రాసింది అని.. ఆ వార్తను సమర్ధిస్తూ సున్నిత సమాచారమును మీడియా సమావేశంలో పచ్చ పార్టీ నేతలు బయట పెట్టాయి అని.. ఆ నేతలపై దేశద్రోహం కేసు పెట్టాలి అని విజయసాయి రెడ్డి సంచలన ట్విట్  చేశారు. అంతేకాదు.. అమరావతి కోసం వివాదంలోకి నౌకాదళాన్నీ లాగారు అని.. అసలు ఏం బతుకులు మీవి? అంటూ అయన ప్రశ్నల వర్షం కురిపించారు. 

 

అసలు విజయసాయి రెడ్డి ట్విట్ ఇలా చేశారు.. ''విశాఖలో రాజధాని ఏర్పాటుకు నేవీ తీవ్ర అభ్యంతరం చెప్పిందని బోగస్ వార్త రాసిన చంద్రజ్యోతి పైన, దాన్ని సమర్థిస్తూ సున్నిత రక్షణ సమాచారాన్ని మీడియా సమావేశంలో బయట పెట్టిన పచ్చ పార్టీ నేతల పైనా దేశద్రోహం కేసులు పెట్టాలి. ఏం బతుకులు మీవి? అమరావతి కోసం నౌకాదళాన్నీ వివాదంలోకి లాగారు.'' అంటూ చేశారు. 

 

ఇక పోతే ఈ ట్విట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ ట్విట్ చుసిన నెటిజన్లు అంత బిన్నంగా స్పందిస్తున్నారు.. వాళ్ళు అంతే అండి.. వాళ్ళ పంతం కోసం దేన్నైనా లాగుతారు.. అసలు వాళ్ళు మనుషులు అయితే కదా అంటూ కామెంట్లు చేశారు.. మరి కొందరు అయితే మరి ఘోరంగా పచ్చ పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: