ఈ మధ్యకాలంలో ఎన్ని దారుణాలు జరుగుతున్న యువతి, యువకుల్లో మార్పు రావడం లేదు.. ప్రేమలంటు, బాయ్‌ఫ్రెండ్స్,  గర్ల్ ఫ్రెండ్స్ అంటూ నమ్మడం తర్వాత మోసపోవడం తరచుగా జరుగుతున్నదే.. మోసపోయాక నలుగురిలో నవ్వులపాలవడం, లేదా ఆత్మహత్యలు చేసుకోవడం కామన్‌గా మారింది. ఇకపోతే ఒక వ్యక్తి లేడీస్ హస్టల్ దగ్గరకు వెళ్లి నానా హంగామా చేశాడు.. అక్కడ ఒక విద్యార్ధిని తన స్నేహితులతో మాట్లాడుతుండగా, అబ్బాయిలతో ఎందుకు మాట్లాడుతున్నావంటూ చేయిచేసుకున్నాడట.. ఆ వివరాలు తెలుసుకుంటే..

 

 

ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌లో పనిచేస్తున్న అమర్‌జీత్‌ సింగ్‌ (45) అనే వ్యక్తి ఇండోర్‌లోని భన్వర్‌ కువాన్‌ ప్రాంతంలో లేడీస్‌ హాస్టల్‌ దగ్గరకు వెళ్లి... హాస్టల్‌ బయట స్నేహితులతో మాట్లాడుతున్న MBA స్డూడెంట్ ని ఎందుకు అబ్బాయిలతో మాట్లాడుతున్నావంటూ..  ఆమెపై దాడి చేశాడు. దీంతో అతడిపై ఇండియన్ పీనల్ కోడ్, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.. ఇకపోతే నిందితుడు అమర్‌జీత్ సింగ్ హాస్టల్ సమీపంలోనే నివసిస్తున్నాడట.. ఇక అమర్‌జీత్ సింగ్ దాడి చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న వారిలో ఎవరో ఈ తతంగాన్నంతా వీడియో తీసి ట్విట్ చేశారట..

 

 

అతను కొడుతుంటే అక్కడున్నవారు ఎంత ఆపినా కానీ, అందరినీ నెట్టుకుని వెళ్లి మరీ ఆ అమ్మాయిని కొట్టాడట.. ఇకపోతే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన ఈ ఘటనతో ఒక్క సారిగా హస్టల్లో ఉంటున్న విద్యార్ధినిలు ఉలిక్కుపడ్డారట.. ఇక ఈ సమాచారం పోలీసులకు చేరడంతో ఆ వ్యక్తిని మధ్యప్రదేశ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం...  

 

 

ఇక ఈ కాలంలో కన్న తల్లిదండ్రులే ఇలాంటి కొన్ని కొన్ని విషయాల్లో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.. అలాంటిది ఒక బయటి వక్తి లేడీస్ హస్టల్లోకి దూరి అమ్మాయిపై చేయిచేసుకోవడం సమంజసం కాదంటున్నారు కొందరు.. అతను వారి మంచికోసమే చేసిన, చెప్పే విధానం మాత్రం ఇది కాదు.. ఇంత దారుణంగా ప్రవర్తించి చెప్పవలసిన అవసరం లేదు.. ఈ కాలంలో మంచి చెప్పితే వినే వారు లేరు కాబట్టి తన పనేదో తాను చేసుకుంటూ ఉండాలి తప్పితే తనకు అవసరం లేని విషయాల్లో జోక్యం తగదని హితబోధ చేస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: