ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు లేదా అబ్బాయిలు పెళ్లయిన తర్వాత ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కామన్ అయిపోయింది. కొందరు చిన్నచిన్న సమస్యలకే విడాకులు ఇచ్చి వెళ్తుంటారు. ఇందుకు చాలా కారణాలున్నాయి. ఒక్కోసారి అక్ర‌మ సంబంధాల వ‌ల్ల కుటుంబం చిన్నాభిన్నం అవ్వొచ్చు లేదా ప్రాణాలు కోల్పోవ‌చ్చు. ఇటీవ‌ల వివాహేతర సంబంధాలు ఎక్కువ‌గా మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి.  అయినా జనాలు మాత్రం వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం మానడం లేదు. కేవలం కొద్ది నిమిషాల శారీరక సుఖం తో పాటు క్షణికావేశంలో చేస్తున్న తప్పుల వల్ల ఎంతో మంది చనిపోతుంటే.. ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి.


 
ఇక తాజాగా ఓ భర్త కళ్లుగప్పి ప్రియుడితో రాస‌లీల‌లు కొన‌సాగిస్తున్న‌ భార్య బాగోతం ఆమె అత్త కంటపడడంతో దారుణానికి ఒడిగట్టింది. కనీస మానవత్వం లేకుండా అతి కిరాతకంగా అత్త‌ను హత్య చేసి ఏమీ ఎరగనట్టు నటించింది. భర్తకి ఫోన్ చేసి లబోదిబోమంది. చివ‌ర‌కు రంగంలోకి దిగిన పోలీసులు ఆమె గుట్టు ర‌ట్టు చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..  కర్ణాటక రాజధాని బెంగళూరులో బ్యాటరాయనపుర మెయిన్ రోడ్డులో కుమార్, సౌందర్య దంపతులు నివసిస్తున్నారు. కుమార్ తల్లి రాజమ్మ(60) కొడుకుతో పాటే ఉంటోంది. అయితే ఓ రోజు స‌డెన్‌గా రాజమ్మ రక్తపు మడుగులో శవమై కనిపించింది. కంగారుపడిన కోడలు భర్తకి ఫోన్ చేసింది. 

 

విష‌యం తెలుసుకున్న భ‌ర్త  ఇంటికొచ్చేశాడు. ఆమె మెడలో బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. ఎవరైనా దొంగలు బంగారం కోసం చంపేసి ఉంటారని అనుమానించారు. ఇక ఇంత‌లోనే పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఆమెను హత్య చేయాల్సిన అవసరం ఎవరికొచ్చిందన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇంటి దొంగల పనిగా భావించిన పోలీసులు.. కోడలు సౌందర్యను త‌మ స్టౌలో విచారించారు. అప్పుడు అస‌ల విష‌యం బ‌య‌టప‌డింది. రాజమ్మకు తమలపాకు వేసుకునే అలవాటు ఉంది. కొద్దికాలంగా ఆ ఏరియాలో లైన్‌ మ్యాన్‌గా పని చేస్తున్న నవీన్ జడేస్వామి అనే వ్యక్తి తరచూ రాజమ్మ వద్దకు వచ్చి.. తమలపాకులు అడిగి వేసుకునేవాడు. 

 

ఈ క్ర‌మంలోనే  కోడలు సౌందర్యతో సాన్నిహిత్యం పెంచుకుని.. అక్రమ సంబంధం పెట్టుకున్నారు. అయితే ఒక‌రోజు వీరిద్ద‌రూ రాస‌లీల‌లు కొన‌సాగిస్తుండ‌గా అత్త కంట‌ప‌డింది. వాళ్లిద్దరినీ అలా చూసిన రాజమ్మ.. కోడలిని తీవ్రంగా హెచ్చిరించింది. కొడుక్కి చెప్పి పంచాయితీ పెడతానని బెదిరించడంతో కోడ‌లు ప్రియుడి సాయంతో అతికిరాత‌కంగా ఇనుప రాడ్డుతో కొట్టి చంపారు. ఆ త‌ర్వాత ఏమి ఎరుగ‌న‌ట్టు  బంధువుల ఇంటికి వెళ్లింది. ప్రియుడు అక్కడి నుంచి పారిపోయాడు. గంట తరువాత వచ్చిన కోడలు హైడ్రామాకు తెరతీసింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అత్తను చంపేశారంటూ లబోదిబోమంది. కేసు న‌మోదు చేసిన పోలీసులు ఇంటివారిపైనే నిఘా పెట్ట‌గా అస‌లు విష‌యం రాబ‌ట్టారు. దీంతో నిందితులు సౌంద‌ర్య‌ మ‌రియు ఆమె ప్రియుడు లైన్ మ్యాన్ నవీన్‌ను అరెస్ట్ చేశారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: