ఈ మధ్యకాలంలో మనుషుల్లో మానవత్వం కరువైంది. సాటి మనుషులను ఎలా గౌరవించాలి... మనుషులను మనుషులుగా ఎలా చూడాలని కూడా మరిచి పోతున్నారు సాటి మనుషుల. అందుకే  రోజురోజుకు దారుణ ఘటనలు  వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు బాలికలతో వెట్టి చాకిరి చేయించుకుంటున్న టీవీ యాంకర్ పై శిశు సంక్షేమ కమిటీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

 

 

 వివరాల్లోకి వెళితే... నూజివీడు లోని చైల్డ్ కేర్ లో ఇద్దరు బాలికలు చదువుకుంటున్నారు. అయితే పండుగ సెలవులు పేరుతో ఆ బాలికల  తల్లి  ఇద్దరు బాలికలను హైదరాబాద్ తీసుకెల్లింది . ఇక మళ్ళీ బడికి పంపించకుండా... అక్కడే ఓ టీవీ యాంకర్ ఇంట్లో ఆ ఇద్దరు బాలికలను పనికి కుదిరింది తల్లి. ఇక సెలవులు ముగిసినప్పటికీ కూడా... ఇద్దరు బాలికలను తల్లి చైల్డ్ కేర్ కి తీసుకు రాకపోవడంతో... సీసీఐ అధికారులు మిస్సింగ్ కేసు పెట్టారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఆ ఇద్దరు బాలికల మిస్సింగ్ పై దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని ఓ టీవీ యాంకర్ ఇంట్లో ఆ ఇద్దరు బాలికలు వెట్టిచాకిరి చేస్తున్నట్లు శిశు సంక్షేమ కమిటీ గుర్తించింది. ఈ క్రమంలోనే శిశు సంక్షేమ కమిటీ హైదరాబాద్ లో ఆ  యాంకర్ ఇంట్లో పనికి కుదిరిన ఇద్దరు బాలికలను అదుపులోకి తీసుకున్నారు. 

 

 

 ఇక ఆ  ఇద్దరు బాలికలను విచారించగా అసలు విషయం బయటపడింది. ఇద్దరు బాలికలు కేవలం ఇంటి పనులు చేయడానికి మాత్రమే సదరు టీవీ యాంకర్ ఇంట్లో పని చేయడం తో పాటు ,.. ఆ బాలికలతో ఏకంగా  మసాజ్ లాంటి పనులు కూడా చేయించుకుంటున్నారు అంటూ విచారణలో తేలింది.  తాము  చదువుకుంటానని చెప్పినప్పటికీ తల్లి మాత్రం ఆ యాంకర్ ఇంట్లో పని కుదిరించిందని  బాలికలు తెలిపారు. దీంతో సీడబ్ల్యూసీ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు యాంకర్ పై కేసు నమోదు చేశారు. చైల్డ్ లేబర్ యాక్ట్ ప్రకారం... మైనర్లను పనిలో పెట్టుకో కూడదు అని తెలిసినప్పటికీ... ఎందుకు పెట్టుకున్నారు అని సదరు యాంకర్ ని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని సిడబ్ల్యుసి అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: