రెండు మనసులు ఒక్కటై.. రెండు కుటుంబాలు ఏకమై... ఎంతో  సందడితో చేసేది పెళ్లి. ఇక పెళ్లి తర్వాత జరిగే శోభనం గురించి అయితే ఎంతో మంది ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తూ ఉంటారు. శోభనం అంటే పది మందికి చెప్పుకునేది కాదు. నాలుగు గోడల మధ్య ఎంతో రహస్యంగా జరిగే స్వీట్ మెమరీ. అలాంటి శోభనం  గురించి పదిమందికి తెలిసేలా ఎవరైనా చెబుతారా.. అలాంటిది పదిమందికి ఎందుకు చెబుతారు అంటారా.. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం చెప్పేసాడు.  పదిమందికి కాదు ఊరందరికీ చెప్పేసాడు. తెలియని వాళ్లకు కూడా తెలిసేలా సరి కొత్తగా ఆలోచించాడు.

 

 

శోభనం కోసం ఎన్నాళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాడో... తనలోని ఆత్రుతను మొత్తం ఒక ఫ్లెక్సీ పైన పెట్టి ప్రచారం చేశాడు.  శోభనం రోజునే అందరికీ తెలిసేలా.. తన మనసులో ఉన్న అన్ని ఫీలింగ్స్ ని ఒక ఫ్లెక్సీపై రాసి ఊరంతా సెక్సీ లు పెట్టేసాడు. ఒకసారి ఈ ఫ్లెక్సీని చూస్తే మీరు తెగ నవ్వేసుకుంటారని. నేను నా బ్రహ్మ  చారి జీవితానికి సాంప్రదాయంగా స్వస్తి పలికి పోతున్నాను... ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న తొలిరేయి అనుభవానికి తహ తహ లాడుతూ యుద్ధానికి సిద్ధమైన బాహుబలి లాగా ఈరోజు జరిగే రాత్రి యుద్ధాన్ని ముహూర్త సమయానికి ప్రారంభించి ... అతి తక్కువ సమయంలోనే నా  తల్లిదండ్రులను నాన్నమ్మ తాతయ్యలు చేస్తానని.. అంతఃకరణ శుద్ధి తో ప్రమాణం చేస్తున్నాను.

 

 

 

అంటూ ఓ ఫ్లెక్సీ పైన రాసి ఊరంతా ఆ ఫ్లెక్సీలను పెట్టేసాడు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ఘటన రావులపాలెంలో చోటు చేసుకుంది. ఇంకేముంది సోషల్ మీడియాలో నెటిజనులు ఈ ఫ్లెక్సీ ఫోటో పై ఆసక్తికరంగా కామెంట్లు పెడుతున్నారు. ఆల్ ద బెస్ట్ బ్రో అని కొంతమంది కామెంట్లు పెడుతుంటే... శోభనానికి ఎవడైనా ప్రచారం చేసుకుంటాడు అని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: