ట్రంప్ అంటే పెద్ద కంపు అని ఉన్న ప్రచారాన్ని తుడిచేయడానికి ఈ మధ్య కాలంలో కొన్నొ కొన్ని మంచి పనులను చేయడానికి పూనుకున్నట్టుగా ఉన్నాడు.. ఈ ట్రంప్.. అయితే తాజాగా తాలిబన్లతో ముచ్చట్లు కూడా పెట్టాడటా.. ఇంతకు తాలిబన్లతో ట్రంప్ చేసిన రాజకీయం ఏంటంటే.. వీరిద్దరి మధ్య ఫోన్లో అఫ్గాన్లో శాంతి నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అరగంట పాటు సంభాషణ నడిచిందట..
ఇకపోతే తాలిబన్ల అగ్రనేత, తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడటం చర్చాంశనీయమైంది.. ఇక అమెరికా, తాలిబన్ల మధ్య ఒప్పందం కుదిరేందుకు అఫ్గానిస్తాన్లో హింసాత్మక ఘటనలు తగ్గడమే కారణమని, ఇదే పరిస్థితి కొనసాగాలని ట్రంప్ స్పష్టం చేసినట్లు వైట్హౌస్ ప్రకటించింది. ఒకవేళ ఎప్పటికి శాంతికి కట్టుబడి ఉంటే అఫ్గాన్కు సాయం అందించడంలో అమెరికా ఎప్పుడు ముందుంటుందని ట్రంప్ చెప్పారు.
ఇదిలా ఉండగా బుధవారం అమెరికా, అఫ్గానిస్తాన్ బలగాలను రక్షించే ఉద్దేశంతో.. తాలిబన్పై వైమానిక దాడులకు దిగడంతో మార్చి 10వ తేదీన ఓస్లోలో ప్రభుత్వానికి, ఇతరులకు మధ్య చర్చలు జరిగే అంశం డోలాయమానంలో పడింది. ఇకపోతే బరాదర్తో ట్రంప్ ఫోన్లో మాట్లాడిన కొన్ని గంటల్లోనే హెల్మాండ్లో ఇలా వైమానిక దాడులు జరగడం గమనార్హం.
ఇక గత శనివారం అమెరికా, తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం కుదరగా, అమెరికా తన బలగాలను రానున్న 14 నెలల కాలంలో ఉపసంహరించుకుంటున్న విషయం తెలిసిందే. ఇక మరోవైపు మంగళవారం హెల్మాండ్లో తాలిబన్లు 43 సార్లు దాడులకు ప్రయత్నించారని, వాటిని తిప్పికొట్టేందుకే తాము వైమానిక దాడులకు దిగామని అమెరికా బలగాల అధికార ప్రతినిధి సన్నీ లెగ్గెట్ తెలిపారు. తాలిబన్లు ఇలాంటి దాడులను కట్టిపెట్టి శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉండాలని ఆయన కోరారు...