క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు  ఎంతో మంది ప్రాణాలను బలిగొంటోన్నాయి . క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు నిర్ణయాలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి . ఎన్నో కుటుంబాలను అనాథలుగా మారుస్తున్నాయి. ఇంకా ఎన్నో కుటుంబాలను పెద్దదిక్కు కోల్పోయేలా చేస్తున్నాయి. తాజాగా ఓ తల్లి తీసుకున్న నిర్ణయం... కుటుంబం లో పెను విషాదం నింపింది. ఇంకా ముక్కుపచ్చలారని చిన్నారిని కూడా బలితీసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కిరోసిన్ పోసుకుని బిడ్డతో పాటు తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన చెన్నై రాయపేట లో చోటుచేసుకుంది. తల్లి తీసుకున్న నిర్ణయంతో చిన్నారి కూతురు కూడా బలైపోయింది. 

 

 

 వివరాల్లోకి వెళితే.   చెన్నైలోని రాయపేట లో పైలెట్ చెందు ప్రాంతానికి చెందిన సత్యనారాయణ లతా భార్య భర్తలు. అయితే సత్యనారాయణ అదే ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. ఈ దంపతులిద్దరికీ ఏడాది వయస్సు ఉన్న కుమార్తె నిఖిత  కూడా ఉంది. అయితే గత కొన్ని రోజుల క్రితం లతా రెండవ సారి గర్భం దాల్చింది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని రోజుల క్రితమే ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో.. పరూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది లత. ఇక తీవ్ర రక్తస్రావమై అబార్షన్ కావడంతో తీవ్ర మనస్తాపం చెందింది. ఆ తర్వాత ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చేసింది సదరు మహిళ. 

 

 

 అయినప్పటికీ రక్తస్రావం మాత్రం ఆగకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైనది. ఇక గురువారం ఉదయం భర్త ఎప్పటిలాగే పనికి వెళ్ళాడు. ఇక మధ్యాహ్నం  1:00 సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. సంవత్సరం వయసున్న బిడ్డతో పాటు తనపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. దీంతో శరీరం మొత్తం కాలుతూ ఉంటే కేకలు వేసింది లత. ఈ కేకలు విన్న స్థానికులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే తల్లితో పాటు సంవత్సరం వయసున్న చిన్నారి కూడా చనిపోయారూ. దీనిపై రాయపేట పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి  కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. వీరిద్దరి వివాహం జరిగి రెండు సంవత్సరాలు  మాత్రమే అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: