ఈ మధ్యకాలంలో కామందులు రెచ్చిపోతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి కనీసం ఏం చేస్తున్నారు కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఆడది కనిపిస్తే చాలు కామంతో కళ్లు మూసుకుపోయి అతి దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. వావివరుసలు మరచి లైంగిక దాడికి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అక్కడితో ఆగకుండా ఏకంగా హత్యలు సైతం చేసేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.దీంతో  సభ్యసమాజం తీరు రోజురోజుకి ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. 

 

 

 అయితే ఈ కామందులు కళ్ళు మూసుకుపోయి చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మీద పడి పోయి పశువాంచ ను తీర్చుకుంటున్నారు. అయితే కేవలం మనుషులతో మాత్రమే ఆగడం లేదు వీరి కామపు యవ్వారం... కామంతో కళ్ళు మూసుకుపోయిన సమయంలో కేవలం ఆడపిల్లలపై మాత్రమే వీరు అత్యాచారానికి పాల్పడటం కాదు ... దారుణంగా తాము మనుషులమనే మర్చిపోయి మూగ జీవాలపై కూడా అత్యాచారం చెస్తున్నారు. ఈ రోజుల్లో మూగ జీవాలపై కూడా అత్యాచారాలు జరుగుతున్న ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. 

 

 

 తాజాగా సభ్యసమాజం తలదించుకునే ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు అత్యాచారాలకు పాల్పడుతున్నారు కామాంధులు. ఇక్కడ ఓ లేగదూడ అని కూడా వదలలేదు. బుధవారం రాత్రి హైదరాబాద్లోని హైదర్ గూడ  లో మహేష్ అనే పశువుల కాపరి లేగదూడ పై అత్యాచారానికి పాల్పడ్డాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన పశువుల కాపరి మహేష్ లేగదూడ పై అత్యాచారానికి పాల్పడుతున్నారు సమయంలో.. కొట్టం పక్కనే  ఉన్న ఇంటి యజమాని ఈ ఘటన చూసి అవాక్కయ్యాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: