మనుషులుగా పుట్టినందుకు గర్వపడవలసింది పోయి సిగ్గుపడవలసిన పరిస్దితులను కల్పిస్తున్నారు కొందరు.. ఎలాగంటే తన కామకోరికలు పశువులవలే తీర్చుకుంటూ వావివరసలు మరచి ఆడది అయితే చాలు అనే భావంతో కుక్కలకంటే హీనంగా బ్రతుకుతున్నారు.. ఇలాంటి పాపాత్ములు ఉండటం వల్లే కావచ్చూ మాయదారి రోగాలు వచ్చి తప్పుచేయని వారు కూడా మరణిస్తున్నారు..

 

 

ఇకపోతే ఈ మధ్యకాలంలో కామాంధులు రెచ్చిపోతున్నారు.. ఎంతలా అంటే తమను ఎవరు ఏమి చేయలేరనే ధీమాతో.. ఇలా వారు చెల్లి, తల్లి, కూతురు అనే బంధాలకు విలువ ఇవ్వడం లేదు.. అసలు వారి దృష్టిలో విలువేలేదు.. ఇలాంటి పరిస్దితుల్లో సమాజం సిగ్గుపడే చర్యలు ఎన్నో జరుగుతున్నాయి.. వాటిలో ఇప్పుడు మనం చెప్పబోయే ఘటన గురించి తెలుసుకుంటే ఇలాంటి వారికి సమాజంలో బ్రతికే అవకాశం ఇవ్వద్దంటారు.. ఎందుకంటే కూతురినే చెరచి గర్భం దాల్చేలా చేశాడు ఈ నీచుడు.. ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో వెలుగుచూసింది.

 

 

నేపాల్‌‌కి చెందిన ఓ వ్యక్తి సుమారు 13 ఏళ్ల కిందట రాజ్‌కోట్ జిల్లాలోని నవగమ్ గ్రామానికి వచ్చి స్థిరపడ్డాడు. ఈ క్రమంలో పెళ్లై మూడేళ్ల కూతురుతో ఒంటరిగా జీవిస్తున్న ఆ ప్రాంతానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు.ఇలా కొంతకాలం గడిచిన తర్వాత, అతని కన్ను ఆమె కూతురిపై పడింది. తల్లి లేని సమయంలో సవతి కూతురిని బెదిరించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఇలా అత్యాచారం చేస్తుండడంతో ఆ మైనర్ బాలిక గర్భం దాల్చింది. కాగా ఆ బాలిక నీరసంగా ఉండటం గమనించిన తల్లి ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యులకు అనుమానం వచ్చి గర్భనిర్ధారణ పరీక్షలు చేయగా, బాలికకు నాలుగు నెలల గర్భం అని తేలింది..

 

 

దీంతో షాక్‌కు గురైన ఆ తల్లి కూతురిని విచారించడంతో తండ్రి అరాచకం బయటపడింది. రెండేళ్లుగా తనను శారీరకంగా హింసిస్తున్నాడని చెప్పడంతో ఆ తల్లి తక్షణం తన కూతురి జీవితాన్ని నాశనం చేసిన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఆ కామాంధుడు పారిపోగా ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని అతనికోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు..

మరింత సమాచారం తెలుసుకోండి: