రాజకీయ నాయకులు అన్న తర్వాత కొంత మందికి చాలా సెంటిమెంట్లు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కొంతమంది జ్యోతిష్యాన్ని నమ్ముతారు ఇంకొంతమంది తమ అదృష్టాన్ని నమ్ముతారు... ఇలా ఎవరికి వారు ఎన్నికల్లో పోటీ చేసేవారు వివిధ నమ్మకాలను సెంటిమెంట్లను పెట్టుకుంటారు. తాజాగా తాను రాబోయే ఎన్నికల్లో గెలుస్తానని జ్యోతిష్కుడు చెప్పాడు అంటున్నాడు ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి. వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో మాకు విజయం ఖాయం అంటున్నారు. ఇంతకీ ఆ మాజీ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారా.... ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ తో తలపడి ఓడిన సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 

 

 2022 లో ఉత్తర ప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో... ఏకంగా 350 సీట్లు గెలిచి తాము అధికారంలోకి వచ్చి తీరుతామూ  అంటూ సమాజ్వాది పార్టీ చీఫ్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాను స్వయంగా చెప్పడం లేదని... ఇటీవలే తన చేయి చూసిన ఓ జ్యోతిష్యుడు ఈ మాట చెప్పారు అంటూ అఖిలేష్ యాదవ్ తెలపడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. విమానంలో ఢిల్లీకి వెళ్లి నప్పుడు... ఓ జ్యోతిష్యుడు తన చేయి చూసి... మీరు కష్టపడి పనిచేస్తే ఏకంగా 350 సీట్లు గెలుస్తారు  అని చెప్పారు అంటూ గుర్తు చేశారు సమాజ్వాది పార్టీ చీప్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. 

 

 

 ఆయన చెప్పినట్లుగానే కష్టపడేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. బిజెపి గత ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి 300 సీట్లు గెలవచ్చేమో  కానీ... తమ పార్టీ మాత్రం నిజాలు చెప్పి కష్టపడి 351 సీట్లు గెలిచి చూపిస్తా అంటూ సమాజ్వాది పార్టీ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కుల గణన చేపడతామని తెలిపారు. బీహార్ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదు అని స్పష్టం చేసిన అఖిలేష్ యాదవ్.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై మాత్రం చర్చలు జరిపి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. కాగా 2017 లో జరిగిన ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ కేవలం నలభై ఏడు స్థానాలకు మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: