ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన అతని పేరే వినిపిస్తోంది. యూట్యూబ్ ఛానల్ అన్నింటిలో అతని ఇంటర్వ్యూలు. అతను మహేష్ బాబు నా ఫ్రెండ్ అని అంటాడు...రవి తేజ క్లోజ్ అంటాడు.  ఇప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలు అన్ని నేను చేసినవే అంటాడు... హీరోయిన్స్  అందరి తో నాకు ఎఫైర్ ఉంది అని చెప్తాడు... పెళ్లి చేసుకొని వదిలేశాను అని అంటాడు.. నోటికొచ్చినట్టు మాట్లాడుతునె  ఉంటాడు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నార.. ప్రస్తుతం సోషల్ మీడియాలో పిచ్చి పరాకాష్టకు చేరి... ఏదేదో మాట్లాడుతున్న సునిషిత్  అనే వ్యక్తి. ఇతను  యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలు  అయితే బీభత్సం. మొత్తం టాలీవుడ్ నాదే అని అనేస్తున్నాడు సునిషిత్. ఇంకొ మాట గతంలో ప్రదీప్ సినిమా స్టోరీ నాదే అని పోలీసులకు పిర్యాదు చేసింది కూడా ఇతనే.

 

 

 మైక్ కనబడితే చాలు అడ్డదిడ్డంగా  మాట్లాడేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో పాపులర్ కావడానికి సోషల్ మీడియాలో చాలా మంది బాగా వాడుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు అందరూ సోషల్ వాడుకున్నప్పటికీ  అసలు వాడకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు ఇక్కడ సునిషిత్ అనే వ్యక్తి. ఇలా వింత వింతగా  మాట్లాడుతూ నిజంగానే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిపోయారు సునిషిత్. సోషల్ మీడియాను ఇతని వాగుడుకి ఏకంగా లావణ్య త్రిపాటి విసిగి  పోయింది. ఎందుకంటే ఏకంగా తాను లావణ్య త్రిపాటి ని  పెళ్లి చేసుకున్నాను తర్వాత ఇద్దరికీ విడాకులు అయ్యా అంటూ చెప్పాడు. 

 

 

 ఇక లావణ్య త్రిపాటి మొగుడిని అంటూ సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తున్నా సునీషీత్ పై  లావణ్య త్రిపాటి స్పందిస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సునిషిత్  అనే వ్యక్తి తనను  పెళ్లి చేసుకున్నాను అంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నట్లుగా ఫిర్యాదులో పేర్కొంది లావణ్య త్రిపాఠి. ఈ విషయంపై ఆమె రాతపూర్వకంగా అసిస్టెంట్ ద్వారా... సైబర్ క్రైమ్ ఏసీపి కి ఫిర్యాదు అందజేసింది. అయితే కేవలం చిన్న విషయం తోనే లావణ్య త్రిపాటి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సునిషిత్  వాగుడు కొనసాగుతూనే ఉన్నది . ఏకంగా తమన్నాను కూడా పెళ్లి చేసుకున్నాను అంటూ సునిశిత్  వ్యాఖ్యానించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: