తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆటో డ్రైవర్ రమేష్ మరియు అతని భార్య వెంకటలక్ష్మి చాలా అనుమానస్పద రీతిలో మృతి చెందారు. రాజమండ్రిలో ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న రమేష్ మరియు అతని భార్యను వారి ఇంటిలో సగం కాలిన శవాలుగా చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వచ్చేటప్పటికే విగతజీవులుగా కనిపించిన దంపతులను పరిశీలించిన పోలీసులు దర్యాప్తు నిమిత్తం క్లూస్ టీమ్ ను అక్కడికి పిలిపించారు. ప్రస్తుతం క్లూస్ టీమ్ ఘటనా స్థలం వద్ద ప్రతి చిన్న వివరాన్ని మరియు విషయాన్ని సేకరిస్తున్నారు.

 

అయితే వారి మృతదేహాల వద్ద ఒక ఆత్మహత్య లేఖ దొరికింది. అందులో వారిరువురికి కరోనా వ్యాధి ఉన్నందువల్ల తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని రాసి ఉంది. అయితే సూసైడ్ నోట్ లో ఈ రెండు లైన్లు మినహా ఏమీ లేకపోవడం ఇప్పుడు పోలీసులకు కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. కొంత కాలంగా రమేష్ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతోందని వారి బంధువులు చెబుతూ ఉండగా దంపతులు ఇద్దరూ ఆ భారం మోయలేక చనిపోయారా లేదా నిజంగానే వారికి కరోనా వ్యాధి సోకిందా.... అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

ఇకపోతే వారి మృతదేహాల వద్ద దొరికిన ఒక బ్యాగ్ లో వారు హాస్పిటల్ కి వెళ్లినట్లు ఆధారంగా ప్రిస్క్రిప్షన్ కూడా ఉంది. అయితే అందులో ఉన్న మందులు కరోనా వ్యాధి లక్షణాలను నయం చేసేందుకు వాడేవా కాదా అని తెలిస్తే అసలు విషయం బయటకు వస్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే పోలీసులు ఎవరైనా వీరిని హత్య చేసి ఆ శవాలను తీసుకుని వచ్చి ఇక్కడ వేసి సూసైడ్ నోట్ రాసి వెళ్లిపోయినట్లు కూడా అనుమానిస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: