రోజుల్లో జనాలను భయపెట్టేందుకు కత్తులు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు తుపాకీలు చూపించాల్సిన పని లేదు.... కనీసం కోపంగా చూసే చూపులు కూడా ఏమాత్రం అవసరం లేదు. అదే పనిగా కాసేపు దగ్గితే చాలు మీ చుట్టుపక్కల ఎవరూ ఉండరు. కానీ తర్వాత చోటు చేసుకొనే పరిణామాలు చూస్తేనే మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పుడు కరోనా దయ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.

 

అలాంటి ఒక ఉదంతం ఇప్పుడు అమెరికాలో చోటుచేసుకోగా వీడియో చాలా వైరల్ గా ట్రెండ్ అవుతుంది. పెన్సిల్వేనియా లోని సూపర్ మార్కెట్ కు వెళ్లి ఒక మహిళ ఏమవుతుందో చూద్దాం అని ఒకసారి సరదాగా దగ్గింది. ఎవరూ పట్టించుకోలేదు. ఇలా కాదని అదే పనిగా ఒకటి రెండుసార్లు కాస్త ఎక్కువగానే దగ్గింది. అంతే అని అనుకున్న దాని కన్నా స్పందన భారీగానే వచ్చింది.

 

ఆమె చేసిన పనికి సూపర్ మార్కెట్ యంత్రాంగం మొత్తం పూర్తిగా బెదిరిపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం వైద్య పరీక్షల కోసం తరలించడం చకచకా జరిగిపోయాయి తను కావాలనే దగ్గానని చెప్పినా కూడా రక్త పరీక్షలు నిర్వహించారు. చివరికి ఆమె ఎలంటి కరోనా లేదని తేలింది.

 

పోలీసుల విచారణలో సరదా కోసం తాను దగ్గానని.. తన దగ్గుకు మార్కెట్ సిబ్బంది స్పందన ఎలా ఉంటుందో టెస్టు చేయాలనే తానా పని చేసినట్లు చెప్పటంతో అవాక్కు అయిన పోలీసులు.. ఆమె మీద కేసు నమోదు చేశారు. మరోవైపు ఆమెను పరీక్షల కోసం పంపిన వెంటనే.. సూపర్ మార్కెట్ యాజమాన్యం.. తమ షాపును శానిటైజ్ చేసే క్రమంలో రూ.26 లక్షల విలువైన ఆహారపదార్థాల్ని..నిత్యవసర వస్తువుల్ని పారబోశారు. ఒక చిన్న దగ్గు ఎంత రచ్చ చేసిందో కదూ?

మరింత సమాచారం తెలుసుకోండి: