ప్రపంచంలో మొట్టమొదటి భయంకరమైన
కరోనా వైరస్ పాజిటివ్ గా నమోదైన నగరం వుహాన్ . ఇప్పుడిప్పుడే భయాన్ని వదిలి బయటపడుతోంది . ఇప్పటివరకు చైనాలో 82545
కరోనా కేసులు నమోదు కాగా 3314 మంది చనిపోయారు. చైనా లో ఇప్పటివరకు దాదాపుగా
కరోనా పాజిటివ్ గా నమోదైన కేసులు ఇప్పుడు నెగటివ్ గా మారి డీఛార్జి అయ్యారు . రెండు నెలల సుదీర్ఘ లాక్ డౌన్ తర్వాత చైనా ప్రశాంత వాతారణాన్ని చూస్తోంది.
మరి యిప్పుడు వుహాన్ లో పరిస్థితి మారింది లక్డౌన్ నుండి ప్రశాంత వాతావరణం చవిచూస్తోంది . నగరంలో పారిశ్రామిక సంస్థలు , ఆఫీసులు పనిచేయడం మొదలు పెట్టాయి . వుహాన్ లో వైరస్ తగ్గుముఖం పట్టింది .శుక్రవారం నాడు ఈ నగరం లో తొలిసారిగా ప్రయాణికుల రైలు వచ్చింది .
మరి ఈ నగరంలోకి వచ్చినవారు మొబైల్ అప్ ద్వారా తమ ఆరోగ్య పరిస్థితిని చూపించే గ్రీన్ కార్డు చుపించాల్సివుంటుంది . చైనాలో ఏప్రిల్ 8 వరకు ఆంక్షలు ఉంటాయి .విదేశాలనుండి వచ్చేవారికి క్వారంటైన్ పరీక్షలు వుంటాయని చైనా ప్రభుత్వం చెప్పింది. ఇదిలా ఉండగా చైనాలో ఈ ప్రమాదకర పరిస్థితి ఇంకా సమసిపోలేదని ప్రకటించింది ...