వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభించిన సున్నా వడ్డీ పథకాన్ని నిన్న ఆదివారం రోజున సీఎం వైఎస్ జగన్ పునఃప్రారంభించారు. చంద్రబాబు హయాంలో ఉన్న దాదాపు 1400 కోట్ల వడ్డీ రుణ భారాన్ని వైయస్ జగన్ తగ్గించే ప్రయత్నం చేశారు. ఈ నెల 24న ఈ పథకం లాంఛనంగా ప్రారంభమవుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ లోని దాదాపు 6.9 లక్షల సంఘాల్లోని మహిళలకు 1000కోట్లు మరియు పట్టణ ప్రాంతంలోని1.8 లక్షల సంఘాల్లోని మహిళలకు 400 కోట్లు చొప్పున సీఎం జగన్ చెల్లించ నున్నారు. అయితే ఎన్నికల ప్రచారం సమయంలో జగన్ చేసిన 24603 కోట్ల రుణ మాఫీ ఇంకా చెల్లించాల్సి ఉంది .ఈ మొత్తాన్ని సీఎం జగన్ ప్రభుత్వం నాలుగు విడతలుగా చెల్లిస్తున్నట్లు తెలియజేశారు. అప్పటివరకూ ఆరు నెలల కు ఒకసారి వడ్డీని లబ్ధిదారుని ఖాతాలో జమ చేస్తామని తెలిపింది.
93లక్షల మంది పొదుపుసంఘాల మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త. సున్నా వడ్డీ పథకం కింద పొదుపు సంఘాల ఖాతాల్లోకి 1400కోట్ల రూపాయలను జమ చేయనున్న ప్రభుత్వం. 2016లో చంద్రబాబు హయాంలో ఆగిపోయిన సున్నా వడ్డీ పథకాన్ని పునఃప్రారంభించనున్న సీఎం వైయస్ జగన్.#YSJaganCares #PeopleCMYSJagan pic.twitter.com/EqzASaeJ8X
— congress PARTY' target='_blank' title='ysr congress-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ysr congress party (@YSRCParty) April 20, 2020