లోకంలో జీవిస్తున్న మనుషులు ఎంత తెలివి గలవారో, అంతే తెలివి తక్కువ వారని సమాజంలో నిత్యం జరుగుతున్న కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి.. ఎందుకంటే ఎక్కడైతే అత్యాశ, అతి విశ్వాసం ఉంటుందో అక్కడ మోసం ఉంటుంది.. నమ్మకం ఉన్న చోటే కదా నేరం చేయడానికి అవకాశం లభిస్తుంది.. దీన్ని వంచన అంటారు.. నీతి తప్పిన మనుషులు, తాము మనుషులం అని మరచిన జాతిలేని కుక్కల వంటి వారు మాత్రమే అతి కౄరంగా ప్రవర్తించి సాటి మనుషుల జీవితాలతో, నమ్మకాలతో ఆడుకుంటారని అందరికి తెలిసిందే.. ఎన్ని ఎన్‌కౌంటర్లు చేసిన, ఎంత మందిని ఉరితీసిన తప్పులు చేసే వారు మారరు.. ఎందుకంటే తర్వాత వచ్చే ముప్పుకంటే, ఆ క్షణం అనుభవించే సుఖమే అతనికి కావలసింది..

 

 

ఇకపోతే ఒక దరిద్రుడు తనకు ఆశ్రయం ఇచ్చిన ఆ ఇంటి యజమాని కూతురుపై కన్నేసి ఆమెను ఎలాగైనా అనుభవించాలనే కుటిల బుద్ధితో, ఆ తల్లిదండ్రుల బలహీనతను ఆసరగా చేసుకుని చివరికి అనుకున్నది నెరవేర్చు కున్నాడు.. ఆ వివరాలు చూస్తే.. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం మాచవరానికి చెందిన విష్ణువర్ధన్‌ రోగాలు నయం చేస్తానని ప్రజలను నమ్మించి ఏవేవో తాయత్తులు కడుతుంటాడట.. ఈ నేపధ్యంలో దొనకొండ మండలం రుద్రసముద్రానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తితో ఇటీవల పరిచయమైంది. కాగా రామాంజనేయులు వారి గ్రామంలో ఉన్న కొందరు అనారోగ్యాలతో, వివిధ సమస్యలతో సతమతం అవుతుండటంతో వారి విషయంలో మోసగాడు అని తెలియని విష్ణువర్ధన్‌ను గుడ్దిగా నమ్మి పిలిపించాడట.. ఇక మీ అందరికి మంచి జరగాలంటే నేను కొన్ని రోజులు ఇక్కడే ఉండి పూజలు చేయాలని నమ్మించగా, అతన్ని పూర్తిగా నమ్మిన రామాంజనేయులు ఇతనికి తనకు తెలిసిన వారింట్లో బస ఏర్పాటు చేయించాడు...

 

 

ఈ క్రమంలో ఆ ఇంటి యజమాని కుమార్తెపై కన్నేసిన విష్ణువర్ధన్‌ మీ ఇంట్లో గుప్తనిధులున్నాయని, ఇందుకు గాను మీ కూతురితో పూజలు చేయిస్తే వెలికితీయొచ్చని నమ్మించాడు. అతన్ని పూర్తిగా నమ్మిన వారు.. ఇతను పూజలు చేయడానికి ఒక గది కూడా ఏర్పాటు చేశారు.. ఇక పూజ చేసే సమయంలో, ఆ బాలిక తనతో ఉంటే సరిపోతుందని, మీరెవ్వరు ఉండవలసిన అవసరం లేదని నమ్మించి అందర్ని బయటకు పంపించిన ఆ కామాంధుడు పూజ గదిలోనే ఆ బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

 

 

ఆ తర్వాత అతని ప్రవర్తనలో మార్పు గమనించిన గ్రామస్థులు అనుమానంతో నిలదీయగా అత్యాచార విషయం వెలుగులోకి వచ్చింది.. ఇంకేముంది అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కానీ ఈ లోపల ఒక అమాయకురాలు అతని దాహానికి బలైంది.. చూశారా మూఢ నమ్మకాల చాటున జరుగుతున్న నేరాలు ఘోరాలు.. అందుకే సమాజంలో మనుషుల కంటే కౄరమైన మృగాలు ఏవి లేవు.. కాబట్టి ఆడపిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన నిరూపిస్తుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: