ఈ మధ్యకాలంలో రోజురోజుకు దారుణ హత్యలు పెరిగిపోతున్నాయి. మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. తాజాగా ఒక ఒళ్ళు గగుర్పొడిచే ఘటన జరిగింది. అందరూ చూస్తుండగానే సమాజ్వాది పార్టీకి చెందిన ఓ నేతను అతని కుమారుని దారుణంగా నాటు తుపాకులతో కాల్చి చంపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్న ఈ లైవ్ మర్డర్ చూసిన వారు ఏకంగా షాక్కు గురవుతున్నారు. ఉత్తరప్రదేశ్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్లోని నంబల్ జిల్లాలో సమాజ్వాదీ పార్టీ నేత అతని కుమారుడు దారుణంగా హత్యకు గురయ్యారు. శ్యామ్మోయి గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గ్రామంలో రోడ్డు మరమ్మతు పనులు జరుగుతున్నాయి. అయితే ఈ మరమ్మతు పనుల్లో భాగంగా తమ పొలాల్లో గుంతలు తవ్వుతున్నారు అనే సమాచారంతో.. సమాజ్వాదీ పార్టీకి చెందిన నేత దివాకర్ ఆయన కుమారుడు సునీల్ అక్కడికి చేరుకున్నారు.ఇక తమ పొలంలో అనుమతి లేకుండా ఎందుకు గుంతలు తవ్వుతున్నారు అంటూ ఇద్దరు వ్యక్తులతో వాగ్వాదానికి దిగారు తండ్రి కొడుకులు.
అయితే అప్పటికే నాటు తుపాకులతో ఇద్దరు తండ్రీ కొడుకులను బెదిరించారు గుంతలు తగ్గుతున్న వ్యక్తులు. అయినప్పటికీ భయపడని ఇద్దరు తండ్రీకొడుకులు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఇద్దరు దుండగులు తుపాకీ ఎక్కుపెట్టి తండ్రి కొడుకుల పై దారుణంగా కాల్పులకు తెగబడ్డారు . ఒకరు తండ్రి దివాకర్ ని దారుణంగా కాల్చగా... మరో వ్యక్తి అతని కుమారుడు సునీల్ ని కాల్చారు. ఈ ఘటనతో అక్కడి స్థానిక ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక కాల్పులకు గురైన తండ్రి కొడుకులు ఇద్దరూ అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు అక్కడి స్థానికులు ఒక్కరూ మొబైల్ లో రికార్డ్ చేయగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
@myogiadityanath जी इनको देख के बिल्कुल भी नहीं लग रहा कि इनको कानून व्यवस्था का तनिक भी डर है। अब ज़िम्मेदारी आप की है इनको सबक सिखाने की। #Sambhal_Murder pic.twitter.com/yxxzQkZKmm
— manish Rai (@manishrai_) May 19, 2020