కరోనా వైరస్ భారత పరిధిలోకి వచ్చిన మొదట్లో కంట్రోల్ చేయడానికి భారతదేశంలోని పరిస్థితులు అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. కానీ కరోనా వైర్లెస్ కంట్రోల్ చేయలేని స్థితికి వచ్చింది మాత్రం మర్కజ్ సమావేశం కారణంగానే. ఈ సమావేశానికి విదేశాల నుంచి కొంతమంది రావడం అక్కడ వచ్చినటువంటి వాళ్ళతో వేల సంఖ్యలో ముస్లిం సోదరులు గడపడం... ఇక అక్కడి నుంచి ముస్లిం సోదరులు తమ తమ ఊళ్లకు వెళ్లడం.. అక్కడ మిగతా వాళ్ళతో కూడా కలిసి తిరగడం సమావేశాలు జరపడం తో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పాకి పోయింది ఈ మహమ్మారి. ఏకంగా కంట్రోల్ చేయలేనేంత స్థాయిలోకి వెళ్ళిపోయింది.
ఇలా మర్కజ్ సమావేశం నుంచి వచ్చిన వాళ్ళు జనజీవన స్రవంతిలో కొనసాగడంతో ఎంతగానో పెరిగిపోయింది. దీనిని ప్రభుత్వాలు గ్రహించి వారిని అందరిని గుర్తించి... క్వారంటైన్ చేసేసరికి దేశంలో కరోనా వైరస్ కేసులు సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఇక ఆ తరువాత 10 శాతం మేర వలసకూలీల కారణంగా కూడా పెరిగిపోయింది. ఇక ఇప్పుడు అసెంప్ప్ట మాటిక్ కేసులు ఎక్కువైపోతున్నాయి. అయితే భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి మూలమైనటువంటి తబ్లీజి కి సంబంధించిన 2500 మంది.. కేవలం విజిటింగ్ వీసా మీద వచ్చి ఆ తరువాత మత కార్యక్రమాలలో పాల్గొన్నారు అటువంటిదే తాజాగా తేలింది.
దీంతో వారికి ఏకంగా పది సంవత్సరాలపాటు భారతదేశంలో ప్రవేశాన్ని నిషేధించారు. అయితే గతంలో కూడా ఇలానే నిషేధాలు జరిగాయి. అయితే ఇలా నిషేధాలు జరిగినప్పుడు వీళ్లు కాకుండా వేరే వాళ్ళు వస్తూ ఉంటారని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఇలా రావడం ముఖ్య ఉద్దేశం ఒకరితో ఒకరు కలిసి మత ప్రచారం చేయడం. అందులో తప్పేమీ లేదు కానీ ప్రస్తుతం కరోనా వైరస్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇలా రావటం సరైనది కాదు అంటున్నారు విశ్లేషకులు. అయితే తబ్లిక్ సమావేశంలో నిర్వాహకులు అందరిని మిస్ లీడ్ చేయడం కారణంగానే ప్రస్తుతం భారతదేశంలో క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి అని అంటున్నారు విశ్లేషకులు.