ఏంటో.. ఈ సమాజం ఎటువైపు వెళుతుందో దేవుడికే తెలియాలి. కూతురు భర్త ఉండగానే భార్యకు రెండో పెళ్లి చెయ్యాలి అని నిర్ణయించారు. అయితే ఆమె మొదటి భర్త రెండో పెళ్లికి ఎక్కడ అడ్డు వస్తాడో అని అల్లుడిని అత్తింటి కుటుంబసభ్యులే దారుణంగా హతమార్చిన ఘటన ప్రకాశం జిల్లాలోని చీరాలలో చోటు చేసుకుంది. 

 

పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లాలోని రామ్ నగర్ కాలనీకి చెందిన మోట దిలీప్‌, బోయినవారిపాలేనికి చెందిన రెబ్కా ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంతో మూడు నెలల క్రితం రెబ్కా బోయినవారిపాలెంలో తల్లితండ్రుల వద్దకు వెళ్లిపోయింది.

 

అయితే కొద్ది రోజుల క్రితం ఆమె తల్లితండ్రులు దిలీప్ వద్దకు వెళ్లి అమ్మాయిని కాపురానికి తీసుకువెళ్లాలని సూచించారు. అందుకు దిలీప్ నిరాకరించాడు. దీంతో రెబ్కా తల్లిదండ్రులు ఆమెకు రెండో పెళ్లి చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. ఇంకా ఆ రెండో పెళ్ళికి ఎక్కడ అడ్డు వస్తాడో అని దిలీప్ ను పెళ్లికి ముందే చంపడానికి పథకం వేశారు.

 

దీంతో ప్లాన్ ప్రకారం అతన్ని ఈ నెల 1వ తేదీన మద్యం తాగేందుకు స్థానిక ఆర్టీసీ గ్యారేజ్ వద్దకు దిలీప్ ను రప్పించారు. దిలీప్ తో మాట్లాడూ రెబ్కా తల్లిదండ్రులు గొడవకు దిగారు. ఇంతలో రెబ్కా తండ్రి శ్రీను, బంధువులు చెంగయ్య, రవితేజ, రోజా, రెబ్కా, మరో బాలుడు కలసి గొడ్డలి, కొడవలి, కత్తులతో దిలీప్‌పై దాడి చేశారు. దీంతో అతను అక్కడిక్కడే చనిపోయాడు. అయితే దిలీప్ తల్లి మణిమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీరాల టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.                     

మరింత సమాచారం తెలుసుకోండి: