ప్రపంచ దేశాలను నాశనం చేయడమే లక్ష్యంగా పాకిస్తాన్ లో ఎన్నో సంస్థలు ఉన్న విషయం తెలిసిందే. ఎన్నో రకాల ఉగ్రవాద సంస్థలు ఎప్పటికప్పుడు ప్రపంచ దేశాల పై దాడి చేయడానికి వ్యూహాలు పన్నుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు కొన్ని దేశాలు ఉగ్రవాద సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఇతర దేశాల నాశనానికి కూడా కూడా కాలుదువ్వుతూ ఉంటాయి. ఇలా ఎప్పటికప్పుడు కొత్త ఉగ్రవాద సంస్థలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల నుంచి ఈ ఉగ్ర మూకలు అన్ని రకాలుగా సహాయం అందుతూనే ఉంటుంది.
ఒకానొక సమయంలో రష్యా పై దాడి చేసేందుకు అమెరికా గతంలో ఉగ్ర సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే, అయితే మొదట రష్యాని దెబ్బ కొట్టడం కోసం తాలిబాన్లతో అమెరికా డబ్బులు ఇచ్చినప్పయికి తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో తాలిబన్లను చైనా ఆదుకుందని ఒక టాక్ అయితే మొదటి నుంచి చైనా ఉగ్రవాదులకు సహాయం చేస్తుంది తానే అని అమెరికా అనుకున్నప్పటికీ ఉగ్రవాదులను వెనకుండీ నడిపించి మాత్రం చైనా అన్నది తాజాగా స్పష్టమైన ట్లు తెలుస్తోంది..
ఇక తాజాగా మరో కీలకమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే భారత్ లోకి పాకిస్తాన్ ఉగ్రవాదులు రానివ్వడం లేదు అన్న విషయం తెలిసిందే. సరిహద్దుల్లో భారత దేశం లోకి అక్రమంగా చొరబడి అయ్యేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను ఎప్పటికప్పుడు భారత బలగాలు మట్టు పెడుతూనే ఉన్నారు. అయితే తాజాగా ఆల్ బాదర్ అనే ఉగ్రవాద సంస్థ కు చైనా సైన్యం డబ్బులతో పాటుగా ఆయుధాలను కూడా సప్లే చేస్తుందని.. గతంలో కాశ్మీర్ ఆఫ్ఘనిస్థాన్లో హింసకు పాల్పడిన అటువంటి ఈ సంస్థ మొన్నటికి మొన్న చైనా అధికారులతో కలిసింది అని ఒక టాక్ మాత్రం ప్రస్తుతం తెర మీదికి వచ్చి సంచలనంగా మారింది. దీంతో చైనా ఉగ్రమూకలకు సహాయం చేస్తుందని ప్రపంచ దేశాలు అర్థం చేసుకున్నారని అంటున్నారు విశ్లేషకులు,