ప్రస్తుతం ఓ వైపు భారత్-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇదే అదునుగా భావించిన పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్లోకి అక్రమంగా చొరబడేందుకు పంపించడం... లేదా పాక్ సైన్యం సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను సృష్టించడం లాంటివి చేస్తున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఎన్ని నాటకాలు  ఆడినప్పటికీ భారత సైన్యం మాత్రం అందరికీ సరైన బుద్ధి చెబుతుంది. ఓ  వైపు భారత్ లోకి ప్రవేశిస్తున్న ఉగ్రవాదులను ఎప్పటికప్పుడు మట్టుబేడుతూనే మరోవైపు.. పాకిస్తాన్ సైన్యంకి  కూడా గట్టిగానే బదులిస్తుంది భారత సైన్యం. 

 

 అయితే ఇటీవలి ఎల్ఈడి బాంబులతో పాక్ సైన్యం భారత సైన్యంపై దాడి చేసేందుకు ప్రయత్నించండి. అయితే పాక్ ప్రయత్నాన్ని తిప్పికొట్టింది  భారత సైన్యం. ఇక ఈ ఘటనలో ఏకంగా బాంబు పేలి ఒక వ్యక్తి  కి తీవ్ర గాయాలయ్యాయి. ఇక అప్పటి నుంచి ఎన్నో కీలకమైన ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భారత బలగాలు మొత్తం వరుసపెట్టి ఉగ్రవాదులు పాక్ సైన్యంపై దాడులు జరుపుతూనే ఉన్నారు . భారత బలగాల ఎదురుదాడి లో ఏకంగా ఆరు పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. 

 

 అంతేకాకుండా తీవ్రవాదుల లాంచ్ ప్యాడ్ లని  పలు ప్రాంతాలలో గుర్తించింది భారత సైన్యం. ఈ నేపథ్యంలో ఉగ్రవాద స్థావరాలపై వరుసగా దాడులు చేస్తూనే ఉంది భారత సైన్యం, భారత సైనికులకు సరిగ్గా బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని భారత సైనిక అధికారులు చెబుతున్నారు. ఇక మొత్తంగా పాకిస్తాన్ ఏ అడుగు ముందుకు వేసినా ఎటాక్ చేసి సరిగ్గా బుద్ధి చెప్పడానికి భారత సైన్యం సిద్ధమైపోయింది. గతంలో అయితే పాక్ సైన్యం కాల్పులు జరగడం ఆ తర్వాత మనం అభ్యంతరం వ్యక్తం చేయడం... ఇలా ఎంతో పెద్ద చర్చ నడిచేది... కానీ ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేదానికి ఈ సంఘటన ఒక సాక్ష్యం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: