తాజాగా జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దేవాంగ వీధికి చెందిన 58 ఏళ్ల ఫాన్సీ వ్యాపారి ఇటీవలే కరోనా వైరస్ బారినపడి మరణించాడు. అయితే ప్రాథమిక దశలోనే ఇవి కరోనా వైరస్ లక్షణాలు అని గుర్తించినప్పటికీ... నిర్లక్ష్యం అవగాహన లేమితో వైద్యం చేసుకునేందుకు ముందుకు రాలేదు. క్వారంటైన్ లో ఉండాల్సి వస్తుందని భయపడి తనకు కరోనా లక్షణాలు ఉన్నాయని బయటకి చెప్పలేదు. చివరికి ఆరోగ్యం విషమించి ఇంట్లోనే ప్రాణాలు వదిలాడు. కాగా ఈ ఫ్యాన్సీ వ్యాపారి లో దగ్గు జ్వరం లాంటి కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన ప్రాథమిక దశలోనే అతని భార్య... అతన్ని ఆసుపత్రికి వెళ్లాలి అంటూ ఎన్నో సార్లు బతిమాలింది. ఎన్నోసార్లు ఆసుపత్రికి వెళ్లాలి అంటూ ఒత్తిడి తెచ్చినప్పటికీ సదరు వ్యాపారి మాత్రం కరోనా పరీక్షలు చేయించుకునేందుకు అంగీకరించలేదు.
ఇక కొన్ని రోజుల తర్వాత భార్య వార్డ్ వాలెంటర్ కు చెప్పగా.. వైద్య సిబ్బంది వచ్చి అతనికి పరీక్షించి కరోనా లక్షణాలే అని అనుమానం వ్యక్తం చేశారు. ఇక ఆ తర్వాత అతని నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించి భార్యను ఆ వ్యాపారితో విడి గా ఉండమని చెప్పారు. ఇక రిపోర్టుల్లో అతనికి పాజిటివ్ అని వచ్చింది. కానీ అంతలోపే పరిస్థితి చేయి దాటిపోయింది. సదరు వ్యాపారి తీవ్ర శ్వాసకోస సమస్యతో బాధపడుతూ ప్రాణాలు వదిలాడు.
Powered by Froala Editor