మహారాష్ట్రలోని బీడ్ జిల్లా కు చెందిన కాశీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఈ దారుణ ఘటన. హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న నిందితుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మార్చి 31వ తేదీన తన ఇరవై ఏళ్ల కుమార్తె అఘాయిత్యానికి పాల్పడ్డాడు కామపు ముసుగులో ఉన్న తండ్రి. ఈ విషయం తెలిసిన ఇద్దరు కుమార్తెలు గట్టిగా గోల చేయడం ప్రారంభించారు దీంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు ముగ్గురు కూతుళ్లను గదిలో వేసి దారుణంగా కొట్టారు. ఇక తమకు ఎదురైన పరిస్థితి గురించి ఓ స్నేహితుడి కి సమాచారం అందించడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారి ఇంటికి చేరుకున్న పోలీసులు ముగ్గురు ఆడపిల్లలను వారి చెర నుంచి విడిపించారు. ఇక వారిని కోర్టు ముందు హాజరు పరచగా వాళ్లు ఎన్నో ఏళ్ల నుంచి ఎదుర్కొంటున్న నరకం గురుంచి వివరిస్తూ ఉంటే అందరికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి అనే చెప్పాలి.
2012 నుంచి తన తండ్రి తనపై అత్యాచారం చేస్తున్నాడని.. అంతే కాకుండా తన 18 ఏళ్ళ చెల్లిపై ఐదో తరగతి చదువుతున్న సమయం నుంచే అఘాయిత్యానికి పాల్పడ్డాడని... దీనికి తన తల్లి కూడా సహకరించండి అంటూ ఆ యువతి చెప్పడం నిజంగా అందరినీ షాక్ కి గురిచేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు హెడ్మాస్టర్ దంపతుల మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోర్టు ముందు హాజరుపరచగా వారికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది కోర్టు.
Powered by Froala Editor