పాకిస్తాన్ ఎప్పుడు భారతదేశంలో  అక్రమ చొరబాటు కు ప్రయత్నిస్తూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే గతంలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఈమధ్యకాలంలో మాత్రం భారత సైన్యం పాకిస్థాన్ ఉగ్రవాదులకు పాక్  సైన్యానికి కూడా గట్టిగా బుద్ధి చెబుతున్న విషయం తెలిసిందే. ఏ మాత్రం అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఎక్కడికక్కడ ఉగ్రవాదులను కాల్చి చంపడంతో పాటు  ఉగ్ర శిబిరాలను సైతం ధ్వంసం చేస్తుంది భారత సైన్యం. అక్రమంగా భారత్ లోకి చొరబడ్డ వారిని కూడా దారుణంగా కాల్చి చంపుతున్నాయి భారత బలగాలు. అయితే ఇలా వరుసగా భారత సైన్యం ఉగ్రవాదులను మట్టుబెడుతున్నప్పటికీ పాకిస్తాన్ తీరులో మాత్రం మార్పు రాలేదు. 

 

 ఎన్ని సార్లు భారత బలగాలు బుద్ది  చెప్పినప్పటికీ ఇంకా చొరబాట్లు చేసి కాశ్మీర్లో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఉగ్రవాదులు . తాజాగా ఇలాంటి ప్రయత్నమే ఒకటి చేసింది పాకిస్తాన్ సైన్యం,  ఉగ్రవాదులు. కాశ్మీర్ లోని సోపోర్  ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయినా పాకి ఆరిజన్ ఉస్మాన్ ఎల్ఈటి  కమాండర్ .. భారత్లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించారు. ఇక ఈ ఉగ్రవాది తో పాటు మరో ఇద్దరు కూడా చొరబాటుకు ప్రయత్నించారు. అయితే తాజాగా వీరి  విషయంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిన  సైన్యం  ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. 

 

 

 అదే సందర్భంలో ఇక్కడ ఉగ్రవాదులపై కాల్పులు జరుగుతున్నది గ్రహించిన పాకిస్తాన్ సైన్యం అటునుండి భారత సైన్యంపై కాల్పులు కు తెగబడింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం... ఎదురుదాడి చేయడంతో ఎనిమిది మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు, ఇప్పటికీ కూడా ఎదురుదాడి కొనసాగుతూనే  ఉంది. ఈ దాడిలో పాకిస్థాన్ సైన్యానికి సరిగ బుద్ధి చెప్పడం తో పాటు ఉగ్రవాద శిబిరాలను కూడా నాశనం చేస్తుంది భారత సైన్యం . ఈ ఎదురుదాడి  ఎప్పటి వరకు కొనసాగుతుంది అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: