కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే ఈ సమాజం తీరు ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ రోజుల్లో అసలు మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. చిన్నచిన్న కారణాలతోనే ప్రాణాలు తీస్తున్న సంఘటనలు ఎక్కువైపోతున్నాయి. క్షణికావేశంలో   తీసుకున్న నిర్ణయాలు ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఇలా ఇప్పటి వరకూ చిన్న చిన్న కారణాలతో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో కావలసిన వారి చేతిలోనే దారుణ హత్యకు గురైన వారు ఎంతోమంది. తాజాగా ఇక్కడ ఇలాంటి ఓ ఘటన జరిగింది. ఎంతో సన్నిహితంగా ఉండే స్నేహితులే  యువకున్ని  దారుణంగా హత్య చేశారు. 

 

 దీనికి పెద్ద కారణం ఏమీ లేదు... మాటల మధ్యలో ఆ యువకుడు  ఒక జోక్ వేశాడు అంతే.. ఈ జోకు మిగతా స్నేహితులకు నచ్చలేదు.. దీంతో ఏకంగా స్నేహితుడి ప్రాణాలనే తీసేసారు. ఈ ఘటన లక్నోలోని నోయిడా ప్రాంతంలో జరిగింది. ఈ నెల 5వ తేదీన ఆదిత్య అనే ఒక బిజినెస్ మాన్ తన నివాసం నుంచి ఢిల్లీలో తన స్నేహితులను కలవడానికి వెళ్ళాడు. అటు నుంచి మళ్ళీ తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు, ఇక ఈ క్రమంలోనే ఆదిత్య కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా దాదాపు వారం రోజుల తర్వాత గ్యాంగ్  కెనాల్ కాలువ వద్ద ఆదిత్య మృతదేహం లభ్యమైంది. 

 


 దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదిత్య కలవడానికి వెళ్లిన స్నేహితులు పంకజ్, దేవ్ లను  పోలీస్ స్టేషన్కు పిలిపించి తమదైన శైలిలో విచారణ చేశారు. ఈ క్రమంలోనే ఆదిత్యను హత్య చేసినట్లు అంగీకరించిన ఆ ఇద్దరు స్నేహితులు హత్య చేయడానికి గల కారణం ఏమిటో చెప్పడంతో  పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. ఆదిత్య తమను కలవడానికి వచ్చాడని ఈ క్రమంలోనే సరదాగా మాట్లాడుకుంటున్న  సమయంలో మాటల మధ్యలో ఆదిత్య జోకు వేశాడని.. దీంతో మా ముగ్గురి మధ్య వివాదం జరగగా.. మేమిద్దరం కలిసి ఆదిత్య మీద కర్రలతో దాడి చేసి చంపేసామంటూ  స్నేహితులు నేరం అంగీకరించారు. ఆ తర్వాత ఆదిత్య శవాన్ని గ్యాంగ్  కెనాల్ కాలువ సమీపంలో ఓ డంప్ యార్డ్  లో వేసినట్లు ఆదిత్య స్నేహితులు చెప్పడంతో పోలీసులు సైతం షాకయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: