వెర్రి తలకెక్కితే మనిషి ప్రవర్తనలో వచ్చే మార్పులు కూడా వెర్రి వెర్రిగా ఉంటాయి.. అసలే కరోనా అతి భయంకరంగా విజృంభిస్తుంటే, దీని బారిన పడకుండా ఆరోగ్యాన్ని, ప్రాణాలను రక్షించుకోవలసింది పోయి మతిలేని మూర్ఖులు కరోనాతోనే ఆటలు ఆడుతున్నారు.. ప్రస్తుత పరిస్దితుల్లో ఎవరైనా తుమ్మినా, దగ్గినా హడలిపోతున్నాము.. కానీ ఇక్కడ మనుషులు అని చెప్పుకుంటున్న మెదడులేని రెండు కాళ్ల పురుగులు కరోనా వైరస్‌ను యదేచ్చగా వీలైనంత మందికి అంటిస్తున్నారు..

 

 

ఇకపోతే ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా, కరోనాతో విలవిలలాడుతుంటే ఇక్కడి యువతరం బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ, కోరి మరీ వైరస్‌ కౌగిళ్లలోకి చేరుతుంది.. ఆ వివరాలు చూస్తే.. వాషింగ్టన్‌లో ఉన్న కొన్ని ప్రాంతాల్లోనూ, మరియు కెంటకీ, అలబామా, టెక్సాస్‌ రాష్ట్రాల చుట్టుపక్కల కరోనా పార్టీలు జోరుగా సాగుతున్నాయట.. ఈ పార్టీలు నిర్వహించే వారు వివిధ కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులే కావడం దురదృష్టకరం.

 

 

కాగా ఎవరికైనా కరోనా పాజిటివ్‌ అని తేలితే కొందరు విద్యార్ధులు కలిసి పెద్ద ఎత్తున కరోనా పార్టీ నిర్వహిస్తారు. ఆ పార్టీకి కరోనా రోగులతో పాటుగా, ఆరోగ్యంగా ఉన్నవారు కూడా వస్తారు. అయితే ఈ పార్టీలో అటెండ్ అవ్వాలంటే కరోనా టికెట్లు ఖరీదు చేయవలసిందే.. ఇలా అమ్మిన టికెట్ల ద్వార వచ్చే డబ్బులను, ఆ పార్టీలో పాల్గొన్న వారిలో ఎవరికి మొదట వైరస్‌ సోకితే వారికి ఆ మొత్తాన్ని ప్రైజ్‌ మనీగా ఇస్తారు. ఇదీ ఇప్పుడు అక్కడ నడుస్తోన్న ప్రమాదకరమైన ట్రెండ్‌.

 

 

ఈ పార్టీలు గత కొద్ది వారాలుగా వీకెండ్‌లలోనే ఎక్కువగా జరుగుతున్నాయట.. ఇదిలా ఉండగా ఈ పార్టీలతో కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో ఇక్కడి రాష్ట్ర గవర్నర్ స్పందించి వెంటనే సెప్టెంబర్‌ 9 వరకు ఈ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి విధించారు. మరోవైపు మృత్యువు కరోనా రూపంలో ముంచుకొస్తున్న భయపడకుండా ఈ కొత్త రకం పైత్యం తో ఇక్కడి యువతరం కరోనాను పెంచి పోషిస్తున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: