ములుగు జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడి నానా హంగామా చేశారు దుండగులు. అంతే కాదు ఇంటి యజమానిని బంధించారు. తుపాకీతో బెదిరించి డబ్బుతో పాలు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు దుండగులు. వాజేడు మండలం కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వాజేడు మండలంలో వర్మ అనే వ్యక్తి నివాసిస్తున్నాడు. అతడి ఇంట్లో అర్దరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వర్మ ఒక పెట్రోల్ బంకులో నిర్వహణ కార్యక్రమాలు చేస్తుంటాడు. కాగా.. గత రాత్రి కుటుంబ సభ్యులందరూ బంధువుల ఇంటికి వెళ్లాడు. దీంతో రాత్రి ఇంట్లో ఒక్కడు మాత్రమే ఉన్నాడు.
వర్మ నింద్రిస్తున్న సమయంలో దుండగులు ఇంట్లోకి చొరబడ్డారు. వర్మ కాళ్లు, చేతులు కట్టేశాడు. కేబుల్ వైర్తో మెడకు ఉచ్చు బిగించారు. అనంతరం తుపాకీతో బెదిరించారు. ఇంట్లో ఉన్న రూ.70 వేల నగదు, వెండి ఆభరణాలు దోచుకున్నారు దుండగులు.
ఇంకా నగలు, నగదు కోసం ఇంట్లోని బిరువాను పగులగొట్టారు. అంతటితో ఆగని దుండగులు.. బ్యాంక్ ఖాతాలో ఉన్న మనీని డ్రా చేసి తమకు ఇవ్వాలని బెదిరించారు. ఆ తర్వాత దోచుకున్న సొమ్ముతో దుండగులు పరయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమదు చేసి విచారణ చేపట్టారు.