గత ఐదేళ్లలో అధికారులు ప్రజాప్రతినిధులకు ఏమాత్రం సహకరించలేదు. ఎమ్మెల్యే గా గెలిచిన తన విషయంలోనే అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు.
అధికారులపై ఒత్తిడి తెస్తే మానసికంగా ఇబ్బంది పడతారేమో అని అప్పట్లో వదిలేసా. భగవంతుడు- ప్రజలు నన్ను ఆశీర్వదించి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించారు.
మండల పరిషత్ సమావేశాలకు ఇకపై అన్ని శాఖల అధికారులు హాజరు కావాల్సిందే.


గైర్హాజరైన అధికారులపైచర్యలు తప్పవు.అధికారులు తప్పుడు సమాచారం చెబితే నమ్మేఅంత పిచ్చి వాడినైతే  కాదు. ప్రజా ధనాన్ని  దుర్వినియోగం చేస్తే  ఇకపై ఉపేక్షించేది లేదు. గత ఐదేళ్లలో ప్రజాధనాన్ని లూటీ చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు.ఉద్యోగాలకు న్యాయం చేయండి. ప్రజా ప్రతినిధులు పర్సంటేజీలు అడిగితే నా దృష్టికి తీసుకు రండి.


ప్రజల వద్ద నుంచి లంచాలు తీసుకోవద్దు.... ఒకవేళ ప్రజలు ఇచ్చినా దయచేసి తీసుకోవద్దుమీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అండగా నిలబడతా. మంగళగిరి మండల పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అధికారులకు హెచ్చరించినట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: