మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన అల్లు అర్జున్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా చాలా జాలీగా ఎంజాయ్ గా ఉంటారని ఫిలిమ్ వర్గాల్లో అంటుంటారు. సెట్స్ లోకి వచ్చారంటే తన సహనటులతో చాలా హ్యాపీగా  ఫన్నీగా ఉంటారని అందరూ అంటుంటారు.   ఆర్టీ నేపథ్యంలో వచ్చిన నాపేరు సూర్య సినిమా డిజాస్టర్ తర్వాత అల్లు అర్జున్ చాలా గ్యాప్ తీసుకొని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్  శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నారు.  ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.  గతంలో ఈ జంట దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటించారు.


తాజాగా అల్లు అర్జున్ తన మొబైల్ ని సీరియస్ గా చూస్తూ బుక్ అయ్యారు.  అయితే ఆయన చూస్తున్న వీడియో ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా..ప్రస్తుతం ప్రపంచం మొత్తం వరల్డ్ కప్ మ్యాచ్ మానియా కొనసాగుతుంది.  అందులోనూ నిన్న భారత్ - పాక్ మద్య జరిగిన మ్యాచ్ ని యావత్ ప్రపంచం మొత్తం టివిలకు అతుక్కుపోయి మరీ చూశారు.  అంతే కాదు ఈ మ్యాచ్ ని తిలకించేందుకు భారత్ నుంచి ఎంతో మంది సెలబ్రెటీలు వెళ్లారు.  


ప్రస్తుతం త్రివిక్రమ్-అల్లు అర్జున్ మూవీ షూటింగ్ జరుగుతుంది.  ఈ సెట్స్ లో అల్లు అర్జున్ నిన్న జరిగిన భారత్ - పాక్ మ్యాచ్ ని తన మొబైల్ లో చాలా సీరియస్ గా తిలకిస్తున్నారు.  అదే సమయానికి పూజా హెగ్డే  వెంటనే కాప్చర్ చేసేసారు. అంతటితో ఆగకుండా ఆ వీడియోని  ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేశారు. బన్నీ మొబైల్‌ ఫోన్‌లో మ్యాచ్‌ చూస్తున్నారని పేర్కొన్నారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  అంతేకదా భారత్ - పాక్ మ్యాచ్ అంటే ఎవరైనా అలా సీరియస్ గా లీనమైపోవాల్సిందే.. కాగా, పాక్ తో జరిగిన మ్యాచ్ లో భారత్   విజయం సాధించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: