ఆంధ్రప్రదేశ్లో రద్దు చేసిన ఎయిర్
ఇండియా విమాన సర్వీసులను పునరుద్ధరించడంతోపాటు విజయవాడ-తిరుపతి-వైజాగ్, విజయవాడ-షిర్డీ, విజయవాడ-బెంగుళూరు రూట్లలో కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభించే ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు ఎయిర్
ఇండియా చైర్మన్ అశ్వనీ లొహానీ ప్రకటించారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయి రెడ్డికి రాసిన లేఖలో ఎయిర్
ఇండియా సీఎండీ తెలిపారు.
ఎయిర్
ఇండియా గత జూలైలో ఆంధ్ర ప్రదేశ్లోని అనేక రూట్లలో విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ నిర్ణయం విమాన ప్రయాణీకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంతో విజయసాయిరెడ్డి ఎయిర్
ఇండియా చైర్మన్ లొహానీతో భేటీ అయ్యారు. రద్దు చేసిన విమాన సర్వీసులను సత్వరమే పునరుద్ధరించడంతోపాటు వైజాగ్-విజయవాడ-బెంగుళూరు, వైజాగ్-విజయవాడ-తిరుపతి మధ్య డైలీ విమాన సర్వీసులను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విజయవాడ, వైజాగ్, తిరుపతి, విజయవాడ-షిర్డీ, విజయవాడ-బెంగుళూరు మధ్య కొత్త విమాన సర్వీసులను ప్రారంభించాలని కూడా కోరుతూ విజయసాయిరెడ్డి ఎయిర్
ఇండియా చైర్మన్ లొహానీకి లేఖ రాశారు.
ఆ లేఖకు లొహానీ ప్రత్యుత్తరమిస్తూ ప్రస్తుతం ఢిల్లీ-విజయవాడ మధ్య వారానికి మూడుసార్లు నడుపుతున్న ఎయిర్
ఇండియా విమాన సర్వీసును అక్టోబర్ 27 నుంచి ఢిల్లీ-విజయవాడ-తిరుపతి-విజయవాడ-ఢిల్లీ సర్వీసుగా నడపనున్నట్లు తెలియచేశారు.తన విజ్ఞప్తికి స్పందించి ఆంధ్ర ప్రదేశ్లో రద్దు చేసిన విమాన సర్వీసులను పునరుద్ధరించాలని ఎయిర్
ఇండియా నిర్ణయించడం పట్ల విజయసాయి రెడ్డి హర్షం ప్రకటించారు. ఎయిర్
ఇండియా చైర్మన్ అశ్వనీ లొహానీకి ఆయన ధన్యవాదాలు తెలియచేశారు.
ఇదిలాఉండగా, ‘వైఎస్సార్ కంటి వెలుగు’ మరో విప్లవాత్మకమైన పథకమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో దృష్టిలోపం నివారించే దిశగా బృహత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. రెండు విడతల్లో 70 లక్షల మంది విద్యార్థులకు వైయస్ఆర్ కంటి వెలుగు పథకం వర్తిస్తుందని చెప్పారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.