రాష్ట్రంలోని ప్రస్తుత పరిణామాల రీత్యా ప్రభుత్వం మార్పు దిశగా గాలులు వీస్తున్నాయని, తన పాదయాత్రకు లభిస్తున్న విశేష స్పందనే ఇందుకు సాక్ష్యమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ గాలులు ఉదృతంగా రాష్ట్రాన్ని అవహించిన అవినీతి మబ్బులను పారద్రోలతాయన్నఆశాభావం వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీల మోత, పెట్రోల్ ధరల వడ్డన తదితర చర్యలతో కిరణ్ ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచిందని, వంట గ్యాస్ ధరను సామాన్యులు భరించలేనిస్థాయికి కిరణ్ ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు.గతంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ కోరే అధికారాన్ని ప్రజలకు అందిస్తామని, ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేస్తామని భరోసా ఇచ్చారు. మచ్చలేని వ్యక్తిత్వం, నీతినిజాయితీ కలిగిన న్యాయశాస్త్ర కోవిదులను ఆ కోర్టులకు జడ్జిలుగా పంపుతామని చెప్పుకొచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: