మాజీమంత్రి, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శంకర్రావు కుమార్తె సుస్మిత తన తండ్రిలాగే నాలుగాకులు ఎక్కువే నేర్చుకున్నట్లున్నారు. పోలీసులు తన తండ్రిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ సుస్మిత కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి, ఆ పార్టీ కోర్‌ కమిటీ సభ్యులకు లేఖలు రాశారు.  తన తండ్రి శంకర్రావుపై రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని , వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సీఎం కిరణ్‌కు నచ్చడం లేదని ఆమె పేర్కొన్నారు . డీజీపీ దినేష్‌రెడ్డి, వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి చాలా దగ్గరి బంధువులని అందుకే సీఎం, డీజీపీలు కలిసి తన తండ్రి పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. సీఐడీ పోలీసులు తాము ఇంట్లో లేనప్పుడు ఇంటికి సోదాలకు వచ్చి చాలా ఇబ్బందులు పెడుతున్నారాని , ఇప్పటికే రాష్ట్ర పోలీసులు తమ ఇంటి పరువును ఆత్మగౌరవాన్ని చంపేశారని ఆవేదన వ్యక్తం చేసారు. మరి వాళ్ళ నాన్నగారు చేసిన ఘనకార్యానికి గల సాక్ష్యాల గురించి ఏమంటుందో సుస్మిత.

మరింత సమాచారం తెలుసుకోండి: