మీరు చదువుతోంది నిజమే. మాకు ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదు, సమైక్య రాష్ట్రమే మంచిది. విడిపోతే తెలంగాణ ఇబ్బందులలో పడుతుందని తెలంగాణలోని వరంగల్ నుండి కొందరు విద్యార్ధులు తనకు ఫోన్ చేశారని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు గుంటూరులో జరిగిన సమైక్యాంద్ర జేఏసీ సమావేశంలో వెల్లడించినట్లు తెలుస్తోంది.  ఇంతకుముందు లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావులు మాత్రమే సమైక్యావాదం వినిపిస్తున్నారని దాడి చేశారని, ఇప్పుడు తమకు ఉండవల్లి అరుణ్ కుమార్, కేవీపీ రాంచంద్రారావు కూడా తోడయ్యారని, అంతా కలిసి రాష్ట్రం విడిపోకుండా గట్టిగా కృషిచేస్తామని అన్నట్లు సమాచారం.ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ అస్సలు రాదని, రోశయ్య ప్రభుత్వం గొడవల వల్ల వేల మంది చనిపోతారని చెప్పడంతోనే తెలంగాణకు అనుకూలంగా డిసెంబర్ 9న కేంద్రం నిర్ణయం తీసుకుందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: